అసలే లోకమంతా కరోనా వైరస్ భయంతో అల్లాడుతోంది. దేశాలకు దేశాలను చుట్టేస్తూ కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇలా తనకు ఎదురులేదనుకుంటూ భారత్ లో కూడా ప్రవేశించింది. అటువంటి పెను రక్కసి మీద అంతా కలసి పోరాడాలి, వీలైతే చేతనైన సాయం చేయాలి.
లేదా నోరు మూసుకుని గమ్మునుండాలి. కానీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ప్రభుత్వ విప్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం కరోనా వైరస్ పేరిట దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా జగన్ మీద, ఆయన చదువు మీద విమర్శలు చేస్తూ అసందర్భ వ్యాఖ్యలే చేస్తున్నారు.
జగన్ ఏం చదువుకున్నారు, ఆయన కనీసం ఇంటర్ అయినా పాస్ అయ్యారా. ఇలాంటి సీఎం ఉండడం మన దౌర్భాగ్యం అంటూ తిట్లు లంకించుకుంటున్నారు. కరోనా వైరస్ వచ్చినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదని ఆరోపణలు చేస్తున్నాడు. అందరికీ మాస్కులు, శానిటైజర్లు ఎక్కడా అని గద్దిస్తున్నారు.
మరో వైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీని రాజీనామా చేయామంటున్నాడు. ఎందుకంటే కరోనా ఎక్కడా లేదని ఆమె ఈసీకి లేఖ రాశారట. ఇపుడు ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే హక్కు లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు.
రాష్ట్ర ప్రజలు ఏమరుపాటులో వైసీపీని గెలిపించారట. 151 సీట్లు ఇచ్చి తప్పు చేశారట. కరోనాని సైతం అవినీతిమయం చేస్తోందిట వైసీపీ సర్కార్. ఇవీ కూన తమ్ముడు పెద్ద నోరు పెట్టుకుని చేస్తున్న ఆరోపణలు.
ఓ వైపు కరోనా తీవ్రమై జనం భయంతో ఉంటే కరోనా పైన కూడా రాజకీయాలు చేయడం కూన తమ్ముడిక చెల్లిందని వైసీపీ నేతలు అంటున్నారు. వీలైతే సాయం చేయాలి తప్ప చంద్రబాబు తప్ప మరో దిక్కు లేదు ఈ జనాలకు, జగన్ ఏమీ చేయలేడు అని ప్రచారం చేసుకోవడం కంటే దిక్కుమాలిన రాజకీయం వేరొకటి ఉండని కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు.