Advertisement

Advertisement


Home > Politics - National

కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌

కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల‌ను ఐటీ శాఖ స్తంభింప‌జేసి చావు దెబ్బ కొట్టింది. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ యువ‌జ‌న విభాగం ఖాతాలను కూడా ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. ఈ చ‌ర్య‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డానికి రెండు వారాల ముందు ఐటీ శాఖ వ్య‌వ‌హ‌రించిన తీరు అప్ర‌జాస్వామికంగా వుంద‌ని ఆ పార్టీ ప్ర‌తినిధి మండిప‌డ్డారు. బ్యాంకు ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బును సైతం సీజ్ చేసిన‌ట్టు ఆ పార్టీ కోశాదికారి అజ‌య్ మాకెన్ ఆరోపించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం లేదని ఆయ‌న వాపోయారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?