Advertisement

Advertisement


Home > Politics - National

ఇలా పెళ్లి చేసుకుంది, అలా ఇల్లు గుల్ల చేసింది

ఇలా పెళ్లి చేసుకుంది, అలా ఇల్లు గుల్ల చేసింది

దొంగ పెళ్లిళ్లు మగాళ్లు మాత్రమే చేసుకుంటారనుకుంటే పొరపాటు. ఈ విషయంలో మహిళలు కూడా ఏమాత్రం తీసిపోరు. మొన్నటికిమొన్న గుంటూరుకు చెందిన ఓ యువతి, తిరుపతి యువకుడ్ని పెళ్లి చేసుకొని, కొన్ని రోజులకు డబ్బుతో పరారైంది. ఇప్పుడు ఇలాంటిదే మరో ఘటన కాన్పూర్ లో జరిగింది.

నిరాల్ నగర్ లో ఉండే రామ్ కరణ్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఓ మధ్యవర్తి, అతడ్ని సంప్రదించాడు. తన దగ్గర మంచి సంబంధాలున్నాయని, మ్యాచ్ సెట్ చేస్తే 70వేలు తీసుకుంటానని చెప్పాడు. దానికి రామ్ కరణ్ అంగీకరించాడు.

చెప్పినట్టుగానే బిహార్ కు చెందిన ఓ సంబంధం చూశాడు ఆ మధ్యవర్తి. పిల్ల నచ్చింది, వెంటనే పెళ్లి కూడా అయిపోయింది. భార్యను తీసుకొని తన స్వగ్రామం వచ్చాడు రామ్ కరణ్. నూతన దంపతులిద్దరూ వారం రోజులు కాపురం చేశారు.

ఎప్పట్లానే ఆరోజు పొద్దున్నే నిద్రలేచాడు రామ్ కరణ్. భార్యను పిలిచాడు, ఆమె పలకలేదు. ఇల్లంతా వెదికాడు కనిపించలేదు. జాగ్రత్తగా గమనిస్తే, ఇంట్లో ఉన్న డబ్బు, నగలు కూడా మాయమైన విషయం గుర్తించాడు. భార్యకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది.

దీంతో తను మోసపోయినట్టు గుర్తించాడు రామ్ కరణ్. తనను దొంగ పెళ్లి చేసుకొని, నగలు-డబ్బుతో అమ్మాయి పారిపోయిందనే విషయాన్ని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమధ్య ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు పోలీసులు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?