Advertisement

Advertisement


Home > Politics - National

ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఏకైక ఎంపీ మృతి

ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఏకైక ఎంపీ మృతి

మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్ పార్టీ ఏకైక లోక్‌స‌భ స‌భ్యుడు సురేష్‌బాలు ధ‌నోర్క‌ర్ (47) అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఈయ‌న మ‌హారాష్ట్ర‌లోని చంద్ర‌పూర్ లోక్‌స‌భ స్థానం నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు. క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్న సురేష్‌బాలును ఈ నెల 28న నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి విమానంలో త‌ర‌లించిన‌ట్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అతుల్ లోంధే  తెలిపారు.

అంత‌కు ముందు రోజు మే 27న కిడ్నీలో రాళ్లు వుండ‌డంతో నాగ్‌పూర్‌లో చికిత్స పొందిన‌ట్టు కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

అదే రోజు ఎంపీ తండ్రి నారాయ‌ణ్ ధ‌నోర్క‌ర్ దీర్ఘ‌కాలిక వ్యాధితో మ‌ర‌ణించారు. అయితే తండ్రి అంత్య‌క్రి య‌ల‌కు కూడా వెళ్ల‌లేని స్థితిలో వైద్యం కోసం ఢిల్లీకి ఎంపీని త‌ర‌లించారు. ఢిల్లీలోని   ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎంపీ తుది శ్వాస విడిచారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.

ఇదిలా వుండ‌గా ధ‌నోర్క‌ర్ గ‌తంలో శివ‌సేన‌లో ప‌ని చేశారు. 2014లో వ‌రోరా భ‌ద్రావ‌తి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌లో చేరి, ఎంపీగా గెలిచారు. అది కూడా కాంగ్రెస్ త‌ర‌పున గెలిచిన ఏకైక ఎంపీగా మ‌హారాష్ట్ర‌లో గుర్తింపు పొందారు. సురేష్‌బాలు ధ‌నోర్క‌ర్ మృతిపై కాంగ్రెస్ అగ్ర నాయ‌కులు సోనియాగాంధీ, మ‌ల్లిఖార్జున‌ఖ‌ర్గే, రాహుల్‌గాంధీ త‌దిత‌రులు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?