Advertisement

Advertisement


Home > Politics - National

తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్!

తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్!

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నోటీసు జారీ చేశారు. 

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ పదవీకాలం ఆగస్టు 26తో ముగియడంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఆగస్టు 27, 2022 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.

సీజేఐ ఎన్వీ రమణ తన వారసుడిగా యూయూ లలిత్ పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశారు. జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయడానికి ముందు కేవలం 74 రోజులు మాత్రమే కుర్చీలో ఉంటారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?