Advertisement

Advertisement


Home > Politics - National

స్టేడియంలోనే కాదు, బయట కూడా 'బ్యాటింగ్'!

స్టేడియంలోనే కాదు, బయట కూడా 'బ్యాటింగ్'!

ఐపీఎల్ ఫైనల్స్ రసవత్తరంగా సాగింది. అయితే అంతకంటే రసవత్తరంగా రాత్రి గడిచిందని చెబుతోంది స్విగ్గీ. ఓవైపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడం, మరోవైపు వాతావరణం చల్లగా మారడం, ఇంకోవైపు ఊహించని విధంగా మ్యాచ్ లో బ్రేక్స్ రావడంతో.. చాలామంది ఆ నైట్ బ్రేక్స్ ను సద్వినియోగం చేసుకున్నారంటోంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఓవైపు మ్యాచ్ జరుగుతుంటే, మరోవైపు అదే టైమ్ లో స్విగ్గీ ఇనస్టామార్ట్ ద్వారా 2423 కండోమ్ ప్యాకెట్లను సరఫరా చేసినట్టు ప్రకటించింది స్విగ్గీ. అంతేకాదు.. ఈ వివరాలు వెల్లడిస్తూ, ఓ ఫన్నీ పోస్ట్ కూడా పెట్టింది. "చూస్తుంటే.. ఈ రాత్రి 22 మంది కంటే ఎక్కువమందే ప్లేయర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు" అంటూ ఫన్నీ పోస్ట్ పెట్టింది.

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆ ఫీవర్ ను క్యాష్ చేసుకుంటోంది స్విగ్గీ. ఎప్పటికప్పుడు క్రికెట్ కు, తన యాప్ కు లింక్ పెడుతూ నెటిజన్లను ఆకర్షిస్తూ వస్తోంది. ఇక ఫైనల్ మ్యాచ్ టైమ్ లో అది పెట్టిన పోస్ట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. చాలామంది నెటిజన్లు, ఈ పోస్ట్ పై స్పందించారు.

ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా మోస్ట్ ఆర్డర్డ్ ఫుడ్ గా మరోసారి బిర్యానీ నిలిచింది. సీజన్ మొత్తమ్మీద చూసుకుంటే, నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని, మొత్తంగా 12 మిలియన్ బిర్యానీల్ని డెలివర్ చేసినట్టు స్విగ్గీ ప్రకటించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?