49వ సీజేఐగా జస్టిస్ లలిత్!

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ లలిత్‌తో ప్రమాణం చేయించారు. Advertisement మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్ లో ల‌లిత్ జ‌న్మించారు.…

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ లలిత్‌తో ప్రమాణం చేయించారు.

మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్ లో ల‌లిత్ జ‌న్మించారు. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ తాత‌, రంగ‌నాథ్ ల‌లిత్ కూడా న్యాయ‌వాదిగా చేశారు. ముంబైలోని ప్ర‌భుత్వ న్యాయ క‌ళాశాల నుండి న్యాయ‌శాస్త్రంలో ప‌ట్ట‌పొందారు. 1983 జూన్‌లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన లలిత్… 1985 డిసెంబరు వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 

ఆ మరుసటి ఏడాది ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీసు మొద‌లుపెట్టారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనేక కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ కూడా భాగస్వామిగా ఉన్నారు.

సీజేఐగా ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్ సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా 65 ఏళ్ల వ‌య‌స్సు వ‌ర‌కు కొన‌సాగుతారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం వ‌చ్చే న‌వంబ‌ర్ వ‌రకు మాత్ర‌మే ఉండ‌నుంది. దాదాపు 74 రోజుల పాటు సీజేఐగా కొన‌సాగనున్నారు.