Advertisement

Advertisement


Home > Politics - Opinion

తెలంగాణలో గ్యాంగ్ రేప్.. సొంత బాబాయ్ అకృత్యం?

తెలంగాణలో గ్యాంగ్ రేప్.. సొంత బాబాయ్ అకృత్యం?

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరుసకు కూతురైన బాలికపై సొంత బాబాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమెను హత్య చేశాడు. మరో ముగ్గురికి కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు.

బాలానగర్‌ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు పని మీద హైదరాబాద్ వెళ్లారు. బాలిక ఒంటరిగా ఇంటి వద్దే ఉంది. ఈ క్రమంలోనే బాలికకు వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి ఆమెపై కన్నేశాడు. అతడితో పాటు మరో ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక తమ పేర్లు బయటపెడుతుందని భయపడి అంతా కలిసి ఆమెను హత్య చేశారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. బాలికను ఫ్యాన్ కు ఉరివేసి ఆత్మహత్యగా చూపించాలనుకున్నారు.

బాబాయ్, తమతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడని, అతడే అక్కను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని, మృతురాలి చెల్లెలు అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా గ్రామం భగ్గుమంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, అనుమానం ఉన్న ఇళ్లపై దాడి చేశారు. సామగ్రిని బయటకు విసిరేశారు. ఈ క్రమంలో ఓ రిపేరు షాపును కూడా ధ్వంసం చేశారు. బాలిక బాబాయ్ కు చెందిన కారును దగ్దం చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు, గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. కేసు నమోదుచేసి విచారణ మొదలుపెట్టారు. ఇద్దరు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి, ఏం జరిగిందో వెల్లడిస్తామని ప్రకటించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?