చంద్ర‌బాబును అవ‌మానించిన ప‌వ‌న్ క‌ల్యాణ్!

'ఏ ఒక్క వ్య‌క్తినో చూసి అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌లు భూములు ఇవ్వ‌లేదు..' అంటున్నారు జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్. రాజ‌ధాని విష‌యంలో పూట‌కో మాట మాట్లాడుతున్న జాబితాలో ప‌వ‌న్ ఇలా చేరారు. ఇప్ప‌టికే వారం…

'ఏ ఒక్క వ్య‌క్తినో చూసి అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌లు భూములు ఇవ్వ‌లేదు..' అంటున్నారు జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్. రాజ‌ధాని విష‌యంలో పూట‌కో మాట మాట్లాడుతున్న జాబితాలో ప‌వ‌న్ ఇలా చేరారు. ఇప్ప‌టికే వారం ప‌ది రోజుల నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ విష‌యంలో ర‌క‌ర‌కాలుగా స్పందించారు. ఇప్పుడు మ‌రో ప‌ల్ల‌వి అందుకున్నారు. అయితే ఈ సారి ప‌వ‌న్ క‌ల్యాణ్ తన మాట‌ల‌తో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును తీవ్రంగా అవ‌మానించిన‌ట్టే!

ఎందుకంటే.. రాజ‌ధాని భూముల విష‌యంలో ఈ మ‌ధ్య వ‌ర‌కూ కూడా చంద్ర‌బాబు నాయుడు ఒకే మాట చెప్పారు. అదేమిటంటే.. అక్క‌డ భూములు ఇచ్చింది త‌న‌ను చూసే అని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకున్నారు. తను చూసి వేల ఎక‌రాల భూమిని ప్ర‌జ‌లు ఇచ్చార‌ని చంద్ర‌బాబు నాయుడు ఎన్నో సార్లు చెప్పుకున్నారు. ఆయ‌న పాత ప్ర‌సంగాల‌ను,  ఎన్నిక‌ల ప్ర‌చార వీడియోల‌ను చూసినా ఈ విష‌యం అర్థం అవుతుంది. అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌లు కేవ‌లం త‌న‌ను చూసే భూములు ఇచ్చార‌ని చంద్ర‌బాబు నాయుడును క‌దిలిస్తే ఇప్పుడు కూడా చెబుతారు. అందులో సందేహాలు అక్క‌ర్లేద‌ని ఆయ‌న పాత ప్ర‌సంగాల‌ను బ‌ట్టి చెప్ప‌వ‌చ్చంటున్నారు విశ్లేష‌కులు.

మ‌రి చంద్రబాబు నాయుడు త‌న‌ను చూసే భూములు క‌లిగిన వాళ్లు రాసిచ్చార‌ని ఒక‌టికి వెయ్యిసార్లు చెప్పుకుంటుంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఎవ‌రినీ చూసీ ప్ర‌జ‌లు భూములు రాసివ్వ‌లేద‌ని అంటున్నారు. మాజీ సీఎం చంద్ర‌బాబుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు జ‌న‌సేన అధిప‌తి. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు వింటే చంద్ర‌బాబు కూడా ఫీల్ కావొచ్చు. త‌న‌ను చూసే భూములిచ్చార‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకుంటుంటే, అదేం లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్నారు. వీళ్లిద్ద‌రి రాజ‌కీయం చాలా ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర‌గానే సాగుతూ ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు చేసుకున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను అవ‌మానిస్తున్న‌ట్టుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు.