మొత్తానికి పంచాయతీ పర్వానికి తెర లేచింది. ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం జరగాల్సిందే అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇపుడు ఎన్నికలు అనివార్యంగా మారాయి. మరి ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది.
ఇంతదాకా వైసీపీకి ఎన్నికలు అంటే భయం అంటూ తమ్ముళ్ళు తెగ రచ్చ చేశారు. బస్తీ మే సవాల్ తేల్చుకుందామని కూడా పెద్ద మాటలే వాడారు. మరి నిజంగా పంచాయతీ జరగబోతోంది.
ఇపుడు టీడీపీని అంత సీన్ ఉందా అన్నదే చర్చగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం సీట్లు గెలుచుకోవాల్సిందే అంటున్నారు శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కూన రవి కుమార్. చావో రేవో అని క్యాడర్ కి గట్టిగానే పిలుపు ఇచ్చారు.
ఆయన వైసీపీని ఓడించాలని అంటున్నారు. ఏ ఒక్క పనీ వైసీపీ హయాంలో ఏ ఒక్క పనీ చేయలేదుట. అందుకే ఓడించాలని అంటున్నారు. మరి ఇపుడు ఎన్నికలు వచ్చాయి కదా. వైసీపీని జీరో చేసి మొత్తం సీట్లను పసుపు పార్టీ గెలుచుకుంటుందా. అంత సీన్ ఉందా అన్నదే ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చగా ఉంది.
ఎన్నికలు తెప్పించారు కానీ వైసీపీ విజయాన్ని టీడీపీ నేతలు ఆపలేరుగా అని మరో వైపు వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి అసలైన సినిమా ఇపుడు తమ్ముళ్లు చూస్తారన్న మాటేగా.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు