చట్టంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని మగవాళ్లను వేధిస్తున్నారని, వారి గోడు కూడా వినాలనే డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదండోయ్ భార్యాబాధితులంతా ఏకమై ఒక సంస్థగా ఏర్పాటై న్యాయం కోసం నినదిస్తున్నారు. భార్యా బాధితులందరినీ ఏకం చేసేందుకు కొన్ని టోల్ఫ్రీ నంబర్లను సైతం ఏర్పాటు చేసుకొని, వాటికి ఫోన్లు చేసి తమ సమస్యలను చెప్పుకోవాలని సదరు సంస్థ నిర్వాహకులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు