తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ రోజు విచారణ ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు ముందుగానే భావించి ఢిల్లీకి వెళ్లుతున్నాయి. అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు తెలంగాణకు రానున్నారు.
ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో బయలుదేరి రాత్రి హకీంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్ జిల్లా హకీంపేట్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(ఎన్ఐఎస్ఏ)కి చేరుకొని.. ఆదివారం ఉదయం అధికారిక కార్యక్రమమైన సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొంటారు. నిజానికి ఇది అధికారిక కార్యక్రమం కాగా…. మరోవైపు తెలంగాణలోని తాజా పరిస్థితులపై తెలంగాణ బీజేపీ నేతలతో కీలక భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొత్తం కవిత చూట్టూనే తిరుగుతున్నాయి. కవిత అరెస్ట్ అయితే బీజేపీపై వచ్చే రాజకీయ విమర్శలు, బీఆర్ఎస్ ఎత్తుగడలను ఎలా ఎదుర్కొనాలి అనే విషయంపై అమిత్ షా స్ధానిక నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.