మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీతకు భారీ ఊర‌ట!

ఆర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీతకు భారీ ఊర‌ట ల‌భించింది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకును మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ గీత‌, ఆమె భ‌ర్త రామ‌కోటేశ్వ‌ర‌రావుకు తెలంగాణ‌ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్…

ఆర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీతకు భారీ ఊర‌ట ల‌భించింది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకును మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ గీత‌, ఆమె భ‌ర్త రామ‌కోటేశ్వ‌ర‌రావుకు తెలంగాణ‌ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ.. త‌దుప‌రి విచార‌ణ డిసెంబ‌ర్ 16కి వాయిదా వేసింది.

మాజీ ఎంపీ దంప‌తుల‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ రూ. 25 వేల వ్య‌క్తిగ‌త పూచీక‌త్తు స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది. త‌ప్పుడు సంస్ధ‌ల పేరుతో బ్యాంకు నుండి రుణం తీసుకుని చెల్లించ‌లేద‌నే ఇటీవ‌ల‌ సీబీఐ కోర్టు కొత్త‌ప‌ల్లి గీత‌, ఆమె భ‌ర్త‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 

సీబీఐ కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ మాజీ ఎంపీ దంప‌తులు తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్ధానం మాజీ ఎంపీ గీత దంప‌తుల‌కు బెయిల్ మంజూరు చేసింది. 

2014 ఎన్నిక‌ల్లో ఆర‌కు నుండి వైసీపీ పార్టీ త‌రుపున ఎంపీగా ఎన్నికై కొద్ది నెలల్లోనే పార్టీకి దూరంగా ఉండి సొంత‌గా పార్టీ ఏర్పాటు చేసి కొద్ది కాలం త‌ర్వాత బీజేపీ పార్టీలో ఆర‌కు మాజీ ఎంపీ జాయిన్ అయ్యారు.