ఇదే దొంగతనం ఆంధ్రలో జరిగివుంటే..!

మనకు వాడి ఫేస్ నచ్చలేదు అంటే మనం మాట్లాడే తీరు మారిపోతుంది. తెలుగుదేశం పునాదుల్లో దాగిన సామాజిక వర్గాని పుట్టిన విషపుత్రికలు అచ్చంగా ఇలాగే వ్యవహరిస్తాయి. ఎక్కడో ఏదో ఒక చోట కుక్క భౌ…

మనకు వాడి ఫేస్ నచ్చలేదు అంటే మనం మాట్లాడే తీరు మారిపోతుంది. తెలుగుదేశం పునాదుల్లో దాగిన సామాజిక వర్గాని పుట్టిన విషపుత్రికలు అచ్చంగా ఇలాగే వ్యవహరిస్తాయి. ఎక్కడో ఏదో ఒక చోట కుక్క భౌ మని అరిచినా, అదిగో జగన్ పాలనలో కుక్కలకు కూడా భయం లేకుండా పోయింది అంటూ రాసుకు వస్తారు. ఎక్కడ చిన్న దొంగతనం, నేరం జరిగినా జగన్ అస్సలు లా అండ్ ఆర్డర్ ను కంట్రోలు చేయలేకపోతున్నారని నిందలేస్తాయి. అదే తెలంగాణ లో జరిగితే వార్తను వార్తగా ప్రెజెంట్ చేస్తాయి. అంత భయం అక్కడ.

కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో దొంగతనం జరిగింది. ఎంత డిటైల్డ్ గా రిపోర్టు ఇవ్వాలో అంత మేరకు ఇచ్చారు. కానీ పొరపాటున కూడా ప్రభుత్వం ప్రస్తావన కానీ, సిఎమ్ పేరు కానీ ఇంకే విధమైన వ్యక్తిత్వ హనన కానీ, అదనపు కామెంట్లు కానీ లేవు. నిజానికి ఇదే సరైన పద్దతి. చంద్రబాబు అధికారంలో వున్నా ఇలాంటి పద్దతే పాటిస్తారు.

కానీ అదేంటో జగన్ సిఎమ్ గా వుంటే మాత్రం ఎక్కడ ఏం జరిగినా జగన్ నే బాధ్యుడు. జగన్ చేతకాని తనం. లోకేష్ లాంటి పిల్ల లీడర్ల దగ్గర నుంచి చంద్రబాబు లాంటి సీనియర్ల వరకు అదే మాట్లాడతారు. ఆ మాటలే ఆర్టికల్స్ గా మారి తెలుగుదేశం అను’కుల’ మీడియాలో ప్రత్యక్షం అవుతాయి. 

గతంలో చంద్రబాబు పవర్ లో వుండగా చేసిన తప్పులు అన్నీ పేపర్ల కింద కప్పేసారు. కానీ జనాన్ని మాయచేయకలేపోయారు. చంద్రబాబును గద్దె దింపారు.

ఇప్పుడు మాత్రం ప్రతి తప్పు జగన్ ఖాతాలో వేస్తూ, జగన్ ఒప్పులు దాచేస్తూ, జనాల్ని మళ్లీ మాయ చేయాలని చూస్తున్నారు. ఈసారి కూడా జనం ఈ మాయను పటాపంచలు చేయగలిగితే ఆంధ్రకు పట్టిన అక్షర దరిద్రం వదిలిపోతుందేమో?