తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం ఆమెది కాదు..!

తెలంగాణ ఇవ్వాలని చెప్పిన వ్యక్తి రాహుల్​ గాంధీ అని కేసీఆర్​కు కూడా తెలియదేమో.

తెలంగాణ కోసం పోరాటం చేసింది తానేనని, తానే తెలంగాణ సాధించానని, చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం సాధించానని కేసీఆర్​పదే పదే చెప్పుకుంటూ ఉంటాడు. ఇందులో కొంత నిజముంది. కొంత అతిశయోక్తి ఉంది. పోరాటం ఆయన మొదలుపెట్టి ఉండొచ్చు. కాని దాన్ని అలుపెరగకుండా కొనసాగించింది ఆయన ఒక్కడే కాదు కదా. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ మొత్తం తెలంగాణ ప్రజలు ఏకమయ్యారు. ఇదో చరిత్ర. ఎంత చెప్పుకున్నా తరగదు.

సరే …దాన్నలా ఉంచితే పోరాటాల కారణంగానో, రాజకీయ అవసరాల కారణంగానో అప్పటి కాంగ్రెసు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్నది సోనియా గాంధీ అని కాంగ్రెసు నాయకులు చెబుతుంటారు. ఆమెను తెలంగాణ దేవత అంటారు. కాంగ్రెసు నాయకులు ప్రేమగా, భక్తిగా సోనియమ్మ అని పిలుచుకుంటారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చినా రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెసు అధికారంలోకి రాలేదు. రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్​ పార్టీ అధికారంలోకి వచ్చింది.

పదేళ్లు పాలించింది. చివరకు కేసీఆర్​మీద వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెసుకు అధికారం అప్పగించారు. ఇది అందరికీ తెలిసిన చరిత్ర. కాని తెలియని విషయం ఒకటుంది. దాన్ని ఇన్నేళ్ల తరువాత తాజాగా టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి బయటపెట్టాడు. అదేమిటంటే…తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం సోనియాగాంధీది కాదు. ఆమె కుమారుడు రాహుల్​ గాంధీది.

తెలంగాణ ఇవ్వాలని ఆయన సోనియా గాంధీకి చెబితేనే యూపీఏ చైర్​పర్సన్​గా ఆమె నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​ దాన్ని అమలు చేశారు. తెలంగాణ ఇవ్వాలనే ఆలోచన రాహుల్​గాంధీకి రాకపోయుంటే రాష్ట్రం ఏర్పడేది కాదన్నట్లుగా జగ్గారెడ్డి చెప్పాడు. కాబట్టి రాహుల్‌ గాంధీ తెలంగాణ దేవుడు అవుతాడు కదా. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చుండేది కాదని అప్పట్లో కేసీఆర్​ కూడా అన్నాడు.

అంటే తెలంగాణ ఇవ్వాలని చెప్పిన వ్యక్తి రాహుల్​ గాంధీ అని కేసీఆర్​కు కూడా తెలియదేమో. రాహుల్​ గాంధీని కేసీఆర్​ తిట్టకూడదని, అనవసరంగా మాట్లాడకూడదని జగ్గారెడ్డి అన్నాడు. ఆయన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్​కు లేదన్నాడు. జగ్గారెడ్డి చెప్పినదాని ప్రకారం చూస్తే తెలంగాణ ప్రజలు రాహుల్​ గాంధీకి రుణపడి ఉండాలా?

8 Replies to “తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం ఆమెది కాదు..!”

    1. రే… రంగడు!

      అయితే.. రాహుల్ గాంధీని బ్రహ్మీని Taj Krishna లో హోటల్ రూమ్ లో ప్రైవేట్ గా మీట్ అయినట్టు, బైటకు చెప్పాలంటావ్ ?

  1. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉసురు ఎవరికి చెందాలి. దరిద్రులు సర్వనాశనమై పోతారు.

  2. అందుకేగా కచరా గాడు తన కుటుంబాన్ని తీసుకొని తెలంగాణ దేవత ఐన సోనియా గాంధీని కలిసింది… అప్పట్లో!! తన ఉద్యమ పార్టీనీ కాంగ్రెసు లో కలిపేస్తా అనికూడా చెప్పాడు రాష్ట్రం ఇస్తే .. కానీ కాంగ్రెస్ బకరా అయ్యింది ఆదివేరే సంగతి..!!

  3. Ante meeru cheppina prakaram baratha dehaniku swathanthryam theesukuvachindi  mahathmagandhi garu okkare kadhu deha prjalu Motham unnaru. Kab attitude gandhi garini mahatma anakoodadhu Antaru AVuna.jaggareddygaru. 

  4. జగ్గన్న చేపిన విషయం లో చాలా నిజముంది. అంతకు మించి లాజిక్కు వుంది. సోనియా మేడెం కు ఆంధ్ర ప్రదేశ్  తెలంగాణా ఎక్కడున్నదో కూడా తెలిసి ఉండకపోవచ్చు. కాదంటే రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగిన్నారు కాబట్టి తెలంగాణా సెంటిమెంట్ తెలుసుకొని తల్లిపై ఒత్తిడి తీసుకొని వఛ్చియుండవచిచ్చు.  కాని ఆరోజు కెసిఆర్ కాంగ్రస్ కీ పెద్ద పీట వేస్తారని, ఆంధ్ర వేరు చేస్తే అక్క్కడ కాంగ్రెస్ రాదనీ atleast కర్ణాటక అసెంబ్లీ లో bjp దెబ్బతిని కాంగ్రెస్ వస్తుంది, తెలంగానా ఇచ్చేస్తే కెసిఆర్ తెరాస ని కాంగ్రెస్లో విలీనం చేస్తే 2 దక్షిణ రాష్ట్రాలు కాంగ్రెస్ అధికారం లో వుంటాయని రాహుల్ రాజకీయం. కాని కెసిఆర్ సోనియా ఎవరైతే రాష్ట్రాన్ని విభజించి ఇచ్చిందో ఆమెకు మొండిచేయి చూపించి 10 ఏళ్ళు కుటుంబ పాలన చేసి మనుషులను రాష్ట్రాన్ని దోచుకున్నారని ప్రజలు భావించి ఇప్పుడు రేవంత్ రెడ్డిగారిని గెలిపించి కాంగ్రెస్కు పట్టంకట్టారు. ప్రజాపాలన  రేవంతరెడ్డి గారికి ఫ్రీహండ్ ఇచ్చి జరిపిస్తారో లేక ప్రతి విషయంలో వేలుపెట్టి రాహుల్ సోనియమ్మ కెలుక్కొని చివరికి జనాలు పెద్దరాజకీయ నాయకులు  మోడీ గారి పక్షానికి వెళ్లే టట్లు చేసుకుంటారో అది మాత్రం రాహుల్ సోనియా ప్రియాంకల చేతిలో వుంది. మల్లికార్జున్ కార్గే ని సోనియా పట్టించుకోరు. జరగాలి బోయేది జగ్గన్న బాగా విశదీకరించగలరు

Comments are closed.