అప్సర హత్య కేసు.. తెరపైకి మరో కొత్త ట్విస్ట్

అప్సరను పూజారి హత్య చేసిన కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. పోస్టుమార్టం నివేదికతో ఇప్పటికే చాలా విషయాలు బహిర్గతం కాగా.. ఈ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ బయటపడింది. మృతురాలు అప్సరకు ఆల్రెడీ…

అప్సరను పూజారి హత్య చేసిన కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. పోస్టుమార్టం నివేదికతో ఇప్పటికే చాలా విషయాలు బహిర్గతం కాగా.. ఈ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ బయటపడింది. మృతురాలు అప్సరకు ఆల్రెడీ పెళ్లయిందనేది ఆ ట్విస్ట్.

అవును.. అప్సరకు ఆల్రెడీ పెళ్లయింది. ఆమె పెళ్లికి సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. మృతురాలు అప్సర, హంతకుడు పూజారి సాయికృష్ణ కలయికకు ఈ పెళ్లే ప్రధాన కారణం.

అప్సరకు ఆల్రెడీ పెళ్లయింది. కాకపోతే భర్తతో ఆమెకు విభేధాలు తలెత్తాయి. దీంతో భర్తను వదిలేసి ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత తల్లితో కలిసి హైదరాబాద్ కు మకాం మార్చేసింది. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంటరయ్యాడు పూజారి సాయికృష్ణ.

తన జాతకంలో ఉన్న దోషాల్ని నివృత్తి చేయాలంటూ సాయికృష్ణను కలిసింది అప్సర. ఆమె జాతకం చూసిన సాయికృష్ణ, గ్రహదోషాలు పోవడానికి ఆమెతో కొన్ని రకాల పూజలు చేయించాడు. ఆ టైమ్ లోనే ఇద్దరూ దగ్గరయ్యారు. తరచూ అప్సర ఇంటికి కూడా వచ్చేవాడు సాయికృష్ణ. అలా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది

కొన్ని రోజులకు సాయికృష్ణను పెళ్లి చేసుకోవాలని భావించింది అప్సర. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే సన్నిహితంగా దిగిన ఫొటోల్ని బయటపెడతానంటూ 3 నెలలు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిందట. అప్పటికే పెళ్లయి, ఓ బిడ్డకు తండ్రిగా ఉన్న సాయికృష్ణ.. ఈ బ్లాక్ మెయిలింగ్ ను జీర్ణించుకోలేకపోయాడు.

అందుకే అప్సరను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ 3 నెలల్లో ఆమెపై 3 సార్లు హత్యాయత్నానికి ప్రయత్నించాడట సాయికృష్ణ. చివరికి తను అనుకున్నది సాధించాడు. శంషాబాద్ లో ఆమెను హత్య చేసి, రోజంతా కారులో మృతదేహాన్ని పెట్టి, ఆ తర్వాత సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో పడేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.