అయ్యో ర‌వ‌ళి…ఇంత‌లోనే ఏమైంది?

తెల్లవారితే మెడ‌లో మూడు ముళ్లు వేయించుకోవాల్సిన యువ‌తి… ఉరి తాడు బిగించుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో పెళ్లి అనేది మ‌ధురానుభూతి. కానీ ఆమెకు మాత్రం మ‌ర‌ణ శాస‌నాన్ని రాసింది. ఏమైందో తెలియ‌దు…

తెల్లవారితే మెడ‌లో మూడు ముళ్లు వేయించుకోవాల్సిన యువ‌తి… ఉరి తాడు బిగించుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో పెళ్లి అనేది మ‌ధురానుభూతి. కానీ ఆమెకు మాత్రం మ‌ర‌ణ శాస‌నాన్ని రాసింది. ఏమైందో తెలియ‌దు … కాళ్ల పారాణి ఆర‌క‌నే ఆ యువ‌తి జీవితం ముగిసిపోయింది. ఈ విషాద ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 26 ఏళ్ల ర‌వ‌ళి అనే యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి, త‌ల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల‌కు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.

ఎస్ఐ రాజారెడ్డి, యువ‌తి బంధువుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా న‌వీపేట‌కు చెందిన ర్యాగ‌ల ర‌వ‌ళికి  జిల్లా కేంద్రానికి చెందిన యువ‌కుడితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. నిజామాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్లో ఆదివారం మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు వివాహం జ‌రిగేలా ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ప‌త్రిక‌ల పంపిణీ జ‌రిగిపోయింది.

ఇరు వైపులా ఇళ్ల‌లో పెళ్లి సంద‌డి మొద‌లైంది. బంధువులు, మిత్రులు పెళ్లి వేడుక‌కు రావ‌డం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో పెళ్లి కుమార్తె త‌మ ఇంటి స్టోర్ రూమ్‌లో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. కూతురు ఉరికి వేలాడడాన్ని గుర్తించిన తండ్రి ప్ర‌భాక‌ర్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

పెళ్లి కొడుకు గ‌త రాత్రి 10.30 గంట‌ల‌కు త‌న కుమార్తెకు ఫోన్ చేసి మాన‌సికంగా హింసించ‌డంతోనే మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని యువ‌తి తండ్రి వాపోయాడు. ర‌వ‌ళి జ్ఞాపకాల‌ను గుర్తు చేసుకుంటూ త‌ల్లిదండ్రులు, బంధువులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.