రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి ఆడియో!

తెలంగాణ‌లో ప్రకంపనలు స్పష్టిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకు ఒక ట్వీస్ట్ బ‌య‌ట‌కొస్తోంది. ఇవాళ కూడా మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘ‌ట‌న‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భార‌తి మ‌ధ్య…

తెలంగాణ‌లో ప్రకంపనలు స్పష్టిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకు ఒక ట్వీస్ట్ బ‌య‌ట‌కొస్తోంది. ఇవాళ కూడా మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘ‌ట‌న‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భార‌తి మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ అంటూ ఒక ఆడియో వెలుగులోకి వ‌చ్చింది. 

ఆ ఆడియోలో స్వామిజీ రామచంద్ర భార‌తి.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో మాట్లాడుతూ నందు మేము మాట్లాడుకున్నాము. మాకు కొన్ని వివరాలు చెప్తే సార్ తో మాట్లాడ‌తాను, ఇప్ప‌టికై ఈ విష‌యంపై సార్ తో మాట్లాడాను వారి పేరు పంపితే బాగుంటుంది అని అడ‌గ్గ…  పేర్లు చెప్ప‌డం క‌ష్టం అని ఇప్ప‌టికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారని, వారిని క‌లిసి మాట్లాడితే బాగుంటుంద‌న్నారు ,ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. 

నెంబ‌ర్ 2 ముందు వారి పేర్లు చెబుతాను అని, ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డితే మా సీఎంతో క‌ష్టం అంటూనే, ప్ర‌స్తుతం ఎల‌క్ష‌న్ ఉండ‌టం వ‌ల్ల బ‌య‌టి రాలేమ‌ని, అందుకే మీరే హైద‌రాబాద్ వ‌చ్చి క‌లిస్తే బాగుటుంద‌ని ఎమ్మెల్యే చెప్ప‌గా… అలాగే హైదరాబాద్‌లోని ఏదో చోటికి వస్తాను. కలుద్దాం అన్నారు.. స్వామిజీ. 

మొత్తానికి స్వామిజీ- ఎమ్మెల్యే సంభాష‌ణ బ‌ట్టి చూస్తుంటే ముందస్తు వ్యూహంలో భాగంగా ట్రాప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఆడియో ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది మాత్రం ఇప్ప‌ట్లో తెలియ‌డం క‌ష్టం అంటూన్నారు విశ్లేష‌కులు. గ‌తంలో కూడా చంద్ర‌బాబు మాట్లాడిన‌ట్లు వ‌చ్చిన ఆడియోపై ఇంత వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఇది కూడా అలాంటిదే కావ‌చ్చు.