అవినాష్ రెడ్డికి భారీ ఊర‌ట..ముందస్తు బెయిల్ మంజూరు!

వివేకా హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ వెకేష‌న్ బెంచ్ తీర్పిచ్చింది. దీంతో సీబీఐ…

వివేకా హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ వెకేష‌న్ బెంచ్ తీర్పిచ్చింది. దీంతో సీబీఐ ఆయ‌న‌ను అరెస్ట్ చేసేందుకు వీలులేకుండా పోయింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ప‌లు ద‌ఫాలుగా సుదీర్ఘ వాద‌న‌లు విన్న తెలంగాణ హైకోర్టు ధ‌ర్మాస‌నం ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ఇచ్చింది. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ వాదించిన హైకోర్టు వారి అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ష‌ర‌తుల‌తో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.

కాగా గతంలో విచారణకు హాజరైనప్పుడే తాను అన్ని విషయాలను సీబీఐ అధికారులకు తెలియజేశానని అవినాష్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే.