చంపడం ఎలా: జైళ్లో సైకో కిల్లర్ క్రైమ్ పాఠాలు

కొన్ని రోజుల కిందట పట్టుబడిన తెలంగాణ సైకో కిల్లర్ ను విచారిస్తున్నకొద్దీ విస్మయం కలిగించే విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. అత్యంత కిరాతకంగా 18 మంది మహిళల్ని హత్య చేసిన సైకో కిల్లర్ రాములు.. జైళ్లో…

కొన్ని రోజుల కిందట పట్టుబడిన తెలంగాణ సైకో కిల్లర్ ను విచారిస్తున్నకొద్దీ విస్మయం కలిగించే విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. అత్యంత కిరాతకంగా 18 మంది మహిళల్ని హత్య చేసిన సైకో కిల్లర్ రాములు.. జైళ్లో కూడా తన మైండ్ సెట్ మార్చుకోలేదు. పైపెచ్చు, తోటి ఖైదీలకు క్రైమ్ పాఠాలు నేర్పించాడు. ఎలా చంపాలి.. ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై ఖైదీలకు శిక్షణ ఇచ్చాడనే విషయం తెలుసుకొని పోలీసులు అవాక్కయ్యారు.

గతంలో పలుమార్లు జైలుకెళ్లిన రాములు, తోటి ఖైదీల్ని తన శిష్యులుగా మార్చుకున్నాడు. వాళ్లకు నేరపాఠాలు బోధించాడు. అతడు చెప్పిన ప్లాన్స్ తో ఓ ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నాడు కూడా. అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసే క్రమంలో కరీంనగర్ పోలీసులకు చిక్కిన అతడు.. రాములు గురించి మరిన్ని వివరాలు బయటపెట్టాడు.

అతడితో పాటు రిమాండ్ లో ఉన్న రాములు కూడా తన నేరచరిత్ర గురించి చాలా విషయాలు పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించాడు. తను హత్య చేసిన మహిళల్లో కొంతమంది ఎవరో కూడా తనకు తెలియదని వివరించాడు. కేవలం మహిళ అనే కసితోనే చంపానని ఒప్పుకున్నాడు.

రాములు తన జీవితంలో అనుభవించిన ఘటనలే అతడ్ని సైకో కిల్లర్ గా మార్చేశాయి. పెళ్లయిన 2 వారాలకే ఇతడి భార్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు కాపురం చేసిన తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె వేరు కాపురం పెట్టుకుంది. ఆ తర్వాత మరో మహిళతో సహజీవనం ప్రారంభించగా.. ఆమె మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

దీంతో మహిళలంటే కోపం పెంచుకున్నాడు రాములు. కల్లు కాంపౌండ్ కొచ్చే మహిళలకు మాయమాటలు చెప్పి, డబ్బు ఎర చూసి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి హత్య చేసేవాడు. అలా ఇప్పటివరకు 18 మంది మహిళల్ని, ఎవరూ గుర్తుపట్టని విధంగా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పై విడుదలైన ఈ సైకో కిల్లర్, ఈసారి జైలు గోడలు దాటి బయటకు రాడని చెబుతున్నారు పోలీసులు. 

కళ్యాణ్ గారితో నన్ను పోల్చొద్దు

మరో ‘రంగస్థలం’ అవుతుంది