Advertisement

Advertisement


Home > Politics - Telangana

కొడుకు తనకు పుట్టలేదంట.. అందుకే చంపేశాడంట

కొడుకు తనకు పుట్టలేదంట.. అందుకే చంపేశాడంట

హైదరాబాద్ శివార్లలోని అనాజ్ పూర్ లో భార్య, కొడుకును అత్యంత కిరాతకంగా చంపేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. "కుటుంబం మొత్తాన్ని చంపేశాడు.. కారణం అస్పష్టం" అంటూ దీనిపై ఇప్పటికే కథనాన్ని ఇచ్చాం. ఇప్పుడీ హత్యలకు అసలైన కారణం తెలిసొచ్చింది.

హైదరాబాద్ శివార్లలోని అనాజ్ పూర్ గ్రామానికి చెందిన ధన్ రాజ్ కి, బండరావిరాలకు చెందిన లావణ్యకు 2018లో వివాహం అయింది. నాలుగేళ్ల పాప తర్వాత రెండో కాన్పు కోసం ఇటీవలే లావణ్య పుట్టింటికి వెళ్లింది. మలి కాన్పులో మగబిడ్డ. నెల రోజుల తర్వాత భార్య పిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు.

అలా ఇంటికి తీసుకొచ్చే క్రమంలోనే భార్యాభర్తల మధ్య కుటుంబ వ్యవహారాలపై గొడవ జరిగిందట. ఇంటికొచ్చిన తర్వాత ఆ గొడవ ఇంకాస్త పెద్దదైందంట. మలి కాన్పులో పుట్టిన మగబిడ్డ, అసలు నీకు పుట్టిన కొడుకు కాదంటూ లావణ్య, ధనరాజ్ ను నిందించిందట. దీంతో తట్టుకోలేకపోయిన ధనరాజ్, బీరుబాటిళ్లు, కల్లుతో ఇంటికొచ్చి.. లావణ్యను హత్య చేశాడు. తన కొడుకు కాదన్నందుకు నెలల వయసున్న మగబిడ్డను కూడా హత్య చేశాడు.

ఈ విషయాల్ని స్వయంగా ధనరాజ్, పోలీసులకు వెల్లడించాడు. భార్య-బిడ్డను హత్య చేసిన అనంతరం రక్తంతో నిండిన బట్టలతో అలానే బైక్ పై పరారయ్యాడు. అవుటర్ రింగ్ కు ఆనుకొని కొంత దూరం ప్రయాణించిన తర్వాత, తిరిగి నగరంలోకి ఎంటరయ్యాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

వెంటనే ధనరాజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అతడికి 2 వారాలు రిమాండ్ విధించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?