Advertisement

Advertisement


Home > Politics - Telangana

కుటుంబం మొత్తాన్ని చంపేశాడు.. కారణం అస్పష్టం

కుటుంబం మొత్తాన్ని చంపేశాడు.. కారణం అస్పష్టం

కుటుంబంలో కలతలు వస్తే చర్చలకు బదులు, హత్యలు జరుగుతున్న కాలమిది. భార్య, భర్త తిట్టుకున్నా కొట్టుకున్నా అది వారికే సరిపోతుంది. దాడులు, హత్యలతో కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. హైదరాబాద్ సమీపంలోని అనాజ్ పూర్ లో కూడా ఇదే జరిగింది. బాలింత అయిన భార్యను హత్య చేసిన భర్త, నెల రోజుల పసిబిడ్డను కూడా సంపులో పడేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. జంట హత్యల తర్వాత రక్తపు బట్టలతోనే బైక్ పై పరారయ్యాడు. ఈ హత్యలు జరిగే క్రమంలో నాలుగేళ్ల బాలిక తప్పించుకుని బయటకు రావడంతో చివరకు ప్రాణాలతో బయటపడింది.

హైదరాబాద్ శివార్లలోని అనాజ్ పూర్ గ్రామానికి చెందిన ధన్ రాజ్ కి, బండరావిరాలకు చెందిన లావణ్యకు 2018లో వివాహం అయింది. నాలుగేళ్ల పాప తర్వాత రెండో కాన్పు కోసం ఇటీవలే లావణ్య పుట్టింటికి వెళ్లింది. మలి కాన్పులో మగబిడ్డ. నెల రోజుల తర్వాత భార్య పిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు. భార్యను అత్తగారింటి నుంచి తీసుకొచ్చే క్రమంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ఆ జంట. బండరావిరాలలో కూడా ఆ జంటను అందరూ ఆశీర్వదించి ఇంటికి పంపించారు. తమతోపాటు ఎవరూ తోడు రావద్దని కూడా చెప్పి భార్య, బిడ్డలను మాత్రమే తీసుకొచ్చాడు భర్త ధన్ రాజ్. తీరా ఇంటికొచ్చాక మృగంలా మారాడు. రెండు ప్రాణాలు తీశాడు.

భార్య, బిడ్డలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బయటకు వెళ్లి బీరు బాటిల్, కల్లు తెచ్చుకున్నాడు ధన్ రాజ్. ఆ తర్వాత మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. గొడ్డలితో ఆమె తలపై నరికాడు. ఈ ఘటన చూసిన కూతురు ఆద్య పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. ఇరుగు పొరుగువారికి విషయం చెప్పింది. వారు ఇంటికెళ్లి చూసేలోగా రక్తపు మరకలు ఉన్న బట్టలతో ధన్ రాజ్ బైక్ పై పారిపోయాడు.

పక్కనే గొడ్డలి పడి ఉంది, పిల్లవాడు కోసం వెదకగా పక్కనే ఉన్న నీళ్ల సంపులో బిడ్డ శవమై పడి ఉన్నాడు. భార్యతో పాటు నెల రోజుల పసిబిడ్డను కూడా దుర్మార్గంగా చంపేసి వెళ్లిపోయాడు ధన్ రాజ్. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?