Advertisement

Advertisement


Home > Politics - Telangana

సంచ‌ల‌నం అంటూ సంచ‌ల‌న‌వార్త చెప్పిన కేసీఆర్!

సంచ‌ల‌నం అంటూ సంచ‌ల‌న‌వార్త చెప్పిన కేసీఆర్!

మ‌రో రెండు మూడు నెల‌ల్లో ఢిల్లీ నుంచి సంచ‌ల‌న వార్త రాబోతోంది... అంటూ ప్ర‌క‌టించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్! ఈ ప్ర‌క‌ట‌న‌తో కేసీఆర్ సంచ‌ల‌నం అయితే రేపారు కానీ, ఇంత‌కీ కేసీఆర్ చెబుతున్న ఆ సంచ‌ల‌నం ఏమిట‌నేది మాత్రం స్ప‌ష్ట‌త రాని అంశ‌మే. జేడీఎస్ పార్టీ ముఖ్య నేత‌లు దేవేగౌడ‌, కుమార‌స్వామిల‌తో స‌మావేశం అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ.. మోడీ ప్ర‌భుత్వ తీరును దుయ్య‌బ‌ట్టారు.

అంతే కాదు.. దేశం మొత్తం మారిపోవాలంటున్నారు కేసీఆర్. గ‌త డెబ్బై ఐదేళ్ల‌లో దేశం గ‌తి మారిందేమీ లేద‌ని కేసీఆర్ తేల్చి చెబుతున్నారు. స‌రైన నాయ‌క‌త్వం ఉంటే దేశం అమెరికా క‌న్నా గొప్ప‌గా మారుతుందంటున్నారు!

మొత్తానికి కేసీఆర్ ఆలోచ‌న‌లు ఇప్పుడంతా దేశం మొత్తాన్నీ మార్చేయ‌డం గురించినే ఉన్న‌ట్టున్నాయి. తెలంగాణ‌లో అధికారం ఉన్న‌ప్ప‌టికీ, ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత దేశ గ‌తిని మార్చేయాల‌నే ఉద్దేశంతో ఉన్న‌ట్టున్నారు. అలాంటి అద్భుతాలు చేసే స‌త్తువ మోడీకి లేద‌ని కేసీఆర్ చెప్ప‌క‌నే చెబుతున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ, ఇంత‌కీ కేసీఆర్ చెప్పిన సంచ‌ల‌నం క‌థేమిట‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం! రెండు మూడు నెలల్లో ఢిల్లీ నుంచి సంచ‌ల‌న వార్త అని మాత్ర‌మే కేసీఆర్ చెబుతున్నారు. అయితే అదేమిటి? దేని గురించి? అనే విష‌యాల‌పై మాత్రం ఆయ‌న క్లూ ఇవ్వ‌లేదు!

ఇంత‌కీ ఆ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఎటు వైపు నుంచి వ‌స్తుందో కూడా కేసీఆర్ మాట‌ల్లో క్లూ అంద‌లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న కూట‌మి ఏదైనా సంచ‌ల‌నం రేప‌బోతోందో.. లేక బీజేపీ వ్య‌తిరేక కూట‌మిని ఏర్పాటు చేయ‌డంలో కేసీఆర్ ఏమైనా సంచ‌ల‌నం న‌మోదు చేయ‌బోతున్నారో ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?