మోసం, ద‌గా, న‌య‌వంచ‌న‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నాయ‌కుడు కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ స‌ర్కార్ ప‌చ్చి మోసానికి, న‌య‌వంచ‌న‌కు పాల్ప‌డుతోంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా…

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నాయ‌కుడు కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ స‌ర్కార్ ప‌చ్చి మోసానికి, న‌య‌వంచ‌న‌కు పాల్ప‌డుతోంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ పోస్టు ఏంటో తెలుసుకుందాం.  

ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..

గ్యారెంటీ కార్డులో.. “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ??

ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??

ఇది ప్రజా పాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన

నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు.. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు.. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు.. 

ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా అన్నారు .. ఇవ్వలేదు

వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు అన్నారు.. వేయలేదు

ప్రతి రైతుకు డిసెంబర్ 9నే.. రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు 

నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు. 

ఓట్ల నాడు ఒకమాట… నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం 

అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ

పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు 

ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. 

నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు..

పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు.. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు..

నేటి నుంచి రైతన్నల చేతిలోనే.. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ.. జై కిసాన్

జై తెలంగాణ అని కేటీఆర్ త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అభ‌య‌హ‌స్తం పేరుతో రైతుల‌కు ఇచ్చిన హామీల‌ను కేటీఆర్ గుర్తు చేశారు. 

రైతు భ‌రోసా కింద ప్ర‌తి ఏటా రూ.15 వేలు, వ్య‌వ‌సాయ కూలీల‌కు రూ.12 వేలు, వ‌రి పంట‌కు బోన‌స్ కింద రూ.500 ఇస్తామ‌ని విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ మేర‌కు కాంగ్రెస్ ప్ర‌చార పోస్ట‌ర్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. 

రేవంత్ కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించి, రైతుల‌కు త‌గిన న్యాయం చేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్‌పై రాజ‌కీయంగా దాడి చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా భావించి ప్ర‌త్య‌ర్థులంతా విరుచుకుప‌డుతున్నారు. దీని నుంచి రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ఎలా అధిగ‌మిస్తుందో చూడాలి.