Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు!

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు!

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక కాన్పులో ఒక బిడ్డ జన్మించడం సహజం. అరుదుగా కొందరికి కవలలు జన్మిస్తుంటారు. కానీ రాజన్న సిరిసిల్లలో ఒకే కాన్పులో న‌లుగురు పిల్ల‌లు జ‌న్మించారు. 

స‌ముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన లావాణ్య కాన్పు కోసం ముస్తాబాద్ ఆస్ప‌త్రిలో చేరారు. ఆమెకు ఇది రెండో కాన్పు. 9 ఏళ్ల క్రితం మొద‌టి కాన్పులో అబ్బాయి జ‌న్మించ‌గా.. ఇప్పుడు తొలుత బాబు, త‌ర్వాత పాప‌, అనంత‌రం ఇద్ద‌రు బాబులు జ‌న్మించారు. అంద‌రూ క్షేమంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. ఒక్కో శిశువు 1 కేజీ బ‌రువు ఉన్నారు. 

పది లక్షల మందిలో ఒకరికి ఇలా ఒకే కాన్పులో నలుగురు జన్మించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నలుగురు పిల్లలను సిద్ధిపేటలోని పిల్లల ఆస్పత్రికి పంపించినట్టు తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?