అమెరికాలో తెలుగు యువ‌తి దుర్మ‌ర‌ణం

అమెరికాలో శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ఒక రోడ్డు ప్ర‌మాదంలో హైద‌రాబాద్ కు చెందిన చ‌రితారెడ్డి అనే యువ‌తి దుర్మ‌ర‌ణం పాల‌య్యింది. మిషిగాన్ లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆగి వున్న కారును…

అమెరికాలో శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ఒక రోడ్డు ప్ర‌మాదంలో హైద‌రాబాద్ కు చెందిన చ‌రితారెడ్డి అనే యువ‌తి దుర్మ‌ర‌ణం పాల‌య్యింది. మిషిగాన్ లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆగి వున్న కారును వెనుక నుంచి మ‌రో కారు వ‌చ్చి బ‌లంగా ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌మాచారం. ఆగి ఉన్న కారులో వెనుక వైపు కూర్చుని ఉన్న చ‌రితారెడ్డి మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో మ‌రో ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వ్య‌క్తిని అరెస్టు చేసిన‌ట్టుగా స‌మాచారం. 

డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం రావ‌డంతో ఎనిమిది నెల‌ల కింద‌ట చ‌రితారెడ్డి యూఎస్ కు వెళ్లిన‌ట్టుగా ఆమె కుటుంబీకులు తెలిపారు. చ‌రితారెడ్డి కుటుంబం హైద‌రాబాద్ లోని నేరెడ్ మేట్ లో ఉంటోంది. ఆమె త‌ల్లిదండ్రులు ఇంద్రారెడ్డి, శోభ‌.

హెచ్ వ‌న్ వీసా ఖ‌రారు కాక‌పోతే త‌ను హైద‌రాబాద్ తిరిగి వ‌స్తానంటూ.. ప్ర‌మాదం జ‌రిగిన రోజు ఉద‌య‌మే త‌మ‌తో ఆమె చెప్పింద‌ని, ఇంత‌లోనే ఘోరం జ‌రిగింద‌ని వారు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. చ‌రితారెడ్డి మృత‌దేహాన్ని ఇండియా త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని స‌మాచారం.