చంద్రబాబూ.. ఏంటీ డ్రామాలు, ఐదేళ్లు ఎలా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన 'చలో ఆత్మకూరు' కార్యక్రమంపై తీవ్రంగా ధ్వజమెత్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. చంద్రబాబు నాయుడువి అన్నీ డ్రామాలు అని, పల్నాడు ప్రాంతంలో తన మూకలను…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన 'చలో ఆత్మకూరు' కార్యక్రమంపై తీవ్రంగా ధ్వజమెత్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. చంద్రబాబు నాయుడువి అన్నీ డ్రామాలు అని, పల్నాడు ప్రాంతంలో తన మూకలను రక్షించుకోవడానికే చంద్రబాబు అలా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

''యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులున్నాయని రచ్చ చేసి కొత్త పరిశ్రమలు రాకుండా చంద్రబాబు నాయుడి దొంగల ముఠా కుట్రలు మొదలు పెట్టింది. పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలింది. ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేదని అర్థమవుతోంది. 

నిద్ర పట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరాడట. చంద్రబాబు, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం అలాగే ఉంది. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన 'అతి'నంతా ఇప్పుడే మొదలుపెట్టారు. చిత్తు చిత్తుగా ఓడి 100 రోజులే అయింది బాబుగారూ. 

ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు చంద్రబాబు గారూ?'' అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!