చంద్రబాబు బందిపోటు ముఠా జైలుపాలు

బందిపోటు ముఠాలో ఒక్కొక్కరు జైలు పాలు అవుతుంటే.. చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదని విమర్శించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. బాబుకు భయం పట్టుకుందని, అందుకే పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. Advertisement “రాష్ట్రంలో…

బందిపోటు ముఠాలో ఒక్కొక్కరు జైలు పాలు అవుతుంటే.. చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదని విమర్శించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. బాబుకు భయం పట్టుకుందని, అందుకే పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

“రాష్ట్రంలో అన్ని స్థాయిల ఎన్నికలు పూర్తయ్యాయి. కరోనా నియంత్రణ చర్యల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. ఇంక ఎవరి దృష్టి మళ్లిస్తే ఎవరికి లాభం చంద్రబాబూ? నీ బందిపోటు ముఠాలో ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే భయం పట్టుకుందా?  పొంతన లేకుండా మాట్లాడుతున్నావు.”

వందల కోట్ల రూపాయల అవినీతిలో ధూలిపాళ్లను జైలుకు పంపిస్తే, బాబు ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదని.. బాబు ప్రాపకం కోసం యనమల లాంటి నేతలు తందానా అంటున్నారని విజయసాయి మండిపడ్డారు.

“తుని నియోజకవర్గంలో తుక్కు తుక్కు అయ్యాక ఫ్రస్టేషన్ పీక్ కు చేరింది యనమలకు. చిత్తుగా ఓడిన ధూళిపాళ్లను వందల కోట్ల అవినీతి కేసులో అరెస్టు చేస్తే రాజకీయంగా ఎదుర్కోలేక లోపలేయించిందంట ప్రభుత్వం. ధూళి గెలిపించిన మున్సిపాలిటీలెన్ని, పంచాయితీలెన్ని? నీలాగే గుండు సున్నా కదా!”

అమూల్ కు మేలు చేసేందుకే సంగంను దెబ్బ తీస్తున్నారంటూ ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణలు చేస్తున్నారని.. అమూల్ అనేది రైతుల సహకార డెయిరీ అని, హెరిటేజ్ లా ఎవరి కుటుంబ ఆస్తి కాదని సెటైర్ వేశారు విజయసాయి..