మరోసారి క్లారిటీ ఇచ్చేసిన విజయసాయిరెడ్డి…?

విజయసాయిరెడ్డి విశాఖ సాయిరెడ్డిగా సుప్రసిద్ధమైపోయారు. విశాఖను ఆయన నోడల్ జిల్లాగా దత్తత తీసుకుని ఆరేళ్ళకు దగ్గర పడుతోంది. ఇక విశాఖ వాసిగానే ఆయన ఉన్నారు. విశాఖ వాణినే ఆయన ఎక్కడ చూసినా వినిపిస్తున్నారు. Advertisement…

విజయసాయిరెడ్డి విశాఖ సాయిరెడ్డిగా సుప్రసిద్ధమైపోయారు. విశాఖను ఆయన నోడల్ జిల్లాగా దత్తత తీసుకుని ఆరేళ్ళకు దగ్గర పడుతోంది. ఇక విశాఖ వాసిగానే ఆయన ఉన్నారు. విశాఖ వాణినే ఆయన ఎక్కడ చూసినా వినిపిస్తున్నారు.

విశాఖకు రాజధాని రావడం ఖాయమని తాజాగా మరోమారు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. న్యాయపరమైన చిక్కులు తొలగాక విశాఖను పాలనా రాజధానిని చేస్తామని కూడా ఆయన గట్టిగానే చెప్పుకొచ్చారు.

విశాఖలో మౌలిక సదుపాయల కల్పనకు తమ ప్రభుత్వం  పెద్ద ఎత్తున కృషి చేస్తుందని కూడా ఆయన తెలియచేస్తున్నారు. విశాఖను సుందరనగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన‌ కర్తవ్యం అని కూడా చెబుతున్నారు.

విశాఖను స్వచ్చమైన నగరంగా, ఆరోగ్య నగరంగా కూడా రూపుదిద్దుతమని అంటున్నారు. ఆ దిశగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అవుతోందని విజయసాయిరెడ్డి చెప్పారు. 

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమని, దానికి ఏం చేయాలో అంతా చేస్తామని ఆయన గట్టి భరోసా ఇస్తున్నారు. మొత్తానికి విశాఖ విషయంలో వైసీపీ సర్కార్ స్పెషల్ అటెన్షన్ చూపిస్తోందని విజయసాయిరెడ్డి మాటలను బట్టి అర్ధమవుతోంది.