టీడీపీ ఉండేది జనంలో కాదు, జూమ్ లోనే!

సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై సెటైర్లు వేయాలంటే రాజకీయ నాయకుల్లో విజయసాయి రెడ్డి తర్వాతే ఎవరైనా. ప్రతి రోజూ తన పంచ్ లతో టీడీపీని చెడుగుడు ఆడుకుంటారు ఈ ఎంపీ. ఈరోజు కూడా అదే…

సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై సెటైర్లు వేయాలంటే రాజకీయ నాయకుల్లో విజయసాయి రెడ్డి తర్వాతే ఎవరైనా. ప్రతి రోజూ తన పంచ్ లతో టీడీపీని చెడుగుడు ఆడుకుంటారు ఈ ఎంపీ. ఈరోజు కూడా అదే రిపీటైంది. చంద్రబాబుతో పాటు లోకేష్ పై పవర్ ఫుల్ పంచ్ లు పేలాయి.

“ఉక్రెయిన్ విద్యార్థులకు జూమ్ లో చంద్రబాబు దారి చూపారట! గూగుల్ మ్యాప్స్ లో బాంబ్స్ లెక్కించారట! చైనా, ఇండియన్ అర్మీస్ కన్నా సీబీఎన్ ఆర్మీ పెద్దదట! టీడీపీ వెకిలి ప్రచారం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇక మీ పార్టీ ఉండేది జనంలో కాదు, జూమ్ లోనే.”

ఇలా తెలుగుదేశం పార్టీపై సెటైర్ వేశారు విజయసాయి. కేంద్ర ప్రభుత్వం చొరవతో ఓవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయులు స్వదేశానికి తిరిగొస్తుంటే, మరోవైపు ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. జూమ్ లో వాళ్లతో మాట్లాడి, దిశానిర్దేశం చేస్తున్నట్టు ఎప్పటికప్పుడు బిల్డప్పులు ఇచ్చుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విజయసాయి ఇలా పంచ్ వేశారు. మరోవైపు 'పుప్పు' అంటూ విజయసాయి వేసిన సెటైర్ కూడా బాగా వైరల్ అవుతోంది.

“టేస్టీ ఫుడ్ కోసం వెతుకులాడటం తప్ప వేరే ధ్యాసేలేని తిండిబోతు పప్పు నాయుడు. టీడీపీకి భలే వారసుడొచ్చాడని జనం నవ్వుకుంటున్నారు. ఈయన నాయకత్వంలో పార్టీ మోడువారిన చెట్టేనని పచ్చ విశ్లేషకులు కుమిలిపోతున్నారట. పప్పూ నీ మూర్ఖత్వంతో మరింత చెలరేగిపో.”

ఇలా ఇవాళ్టికి చంద్రబాబు, లోకేష్ కు ఇవ్వాల్సిన కోటా పంచ్ లు ఇచ్చేశారు విజయసాయి. ఇకనైనా చంద్రబాబు, లోకేష్ తమ అతి తెలివి తగ్గించుకొని, ప్రజలకు పనికొచ్చేలా వ్యవహరిస్తే బాగుంటుందని సూచించారు.