తిండి పోటీలు పెడితే నేనే ఫస్ట్ – పూజా హెగ్డే

హీరోయిన్లు చాలా తక్కువగా తింటారు, పైగా ఏది పడితే అది తినరు. తమ అందాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ పూజా హెగ్డే విషయంలో మాత్రం ఇలాంటివేం లేవంట. తను ప్రతి రోజూ కడుపునిండా…

హీరోయిన్లు చాలా తక్కువగా తింటారు, పైగా ఏది పడితే అది తినరు. తమ అందాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ పూజా హెగ్డే విషయంలో మాత్రం ఇలాంటివేం లేవంట. తను ప్రతి రోజూ కడుపునిండా తింటానంటోంది పూజా హెగ్డే. అంతేకాదు.. తిండి పోటీలు పెడితే అందులో తను ఫస్ట్ వస్తానని ధీమాగా చెబుతోంది.

“నాకు భోజనం అంటే చాలా ఇష్టం. తిండి పోటీలు పెడితే నేను గ్యారెంటీగా ఫస్ట్ వస్తాను. కానీ నా బాడీలో అది కనబడదు. ఎందుకంటే, ఆ స్థాయిలో నేను జిమ్ చేస్తాను. నిజానికి నాకు వ్యాయామం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ బాగా తినాలి, బరువు పెరగకూడదంటే జిమ్ చేయాల్సిందే కదా. అందుకే జిమ్ చేస్తా. కడుపునిండా తింటా”

రాధేశ్యామ్ షూటింగ్ టైమ్ లో తనకు కూడా ప్రభాస్ నుంచి భోజనం క్యారేజీలు వచ్చాయని తెలిపింది పూజా హెగ్డే. ఇటలీ షెడ్యూల్ లో ప్రభాస్ తనను బాగా చూసుకున్నాడని చెప్పుకొచ్చింది.

“ఇటలీ షెడ్యూల్ లో ఉన్నప్పుడు నా స్టాఫ్ లో ముగ్గురికి కరోనా వచ్చింది. దాంతో నాకు భోజనం చాలా ఇబ్బంది అయింది. ప్రతిరోజూ పిజ్జాలు, బర్గర్లు తినలేం కదా. పైగా నాకు ప్రతి రోజూ అన్నం పడాల్సిందే. ఆ టైమ్ లో ప్రభాస్ రోజూ నాకు భోజనం పంపించేవారు. నవరాత్రుల టైమ్ లో కూడా ప్రభాస్ నుంచి క్యారేజీలు వచ్చేవి. ఆ టైమ్ లో నేను శాకాహారం తినేదాన్ని. అందుకే నాకోసం ప్రత్యేకంగా వెజిటేరియన్ భోజనం పంపించేవారు.”

ప్రభాస్ కు తనకు పడడం లేదనే కథనాలపై కూడా స్పందించింది పూజా హెగ్డే. తనకు ప్రభాస్ మధ్య నిజజీవితంలో అంత బాండింగ్ లేకపోతే, స్క్రీన్ పై కెమిస్ట్రీ సరిగ్గా పండదని.. రాధేశ్యామ్ సినిమా చూసిన తర్వాత తనకు, ప్రభాస్ కు మధ్య గొడవలున్నాయంటే ఎవ్వరూ నమ్మకని చెప్పుకొచ్చింది.