తెల్ల కార్డు… పెట్రో మంట ఆపుతుందా… ?

ఒక్క తెల్ల కార్డు ఉంటే చాలు అన్నీ ఫ్రీ ఆల్ ఫ్రీ అనే సమాజమంలో ఉన్నాం. మరి కార్డు ఒక బ్రహ్మాస్త్రం అని సామాన్యుడు అనుకునేలా నేతాశ్రీలు చేశారు. అయితే కార్డు ద్వారా బెనిఫిట్లు…

ఒక్క తెల్ల కార్డు ఉంటే చాలు అన్నీ ఫ్రీ ఆల్ ఫ్రీ అనే సమాజమంలో ఉన్నాం. మరి కార్డు ఒక బ్రహ్మాస్త్రం అని సామాన్యుడు అనుకునేలా నేతాశ్రీలు చేశారు. అయితే కార్డు ద్వారా బెనిఫిట్లు కొన్నే. ఆ పరిధిలోకి రానివి ఎన్నో.

ఇపుడు కొత్త డిమాండ్ ఒకటి వినిపిస్తోంది, తినే బియ్యాన్ని దాదాపుగా ఫ్రీగా ఇస్తున్న పాలకులు పొయ్యి కింద మంట కోసం తెచ్చే వంట గ్యాస్ కి కూడా రాయితీ అడుగుతున్నారు. 

తెల్ల కార్డున్న వారికి ఈ గ్యాస్ సిలిండర్ రాయితీ ఇస్తే ఎంతో మేలు ఏలికలూ అని సూచిస్తున్నారు. అదే విధంగా ప్రతీ రోజూ ఆగకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరల విషయంలోనూ తెల్ల కార్డు దారులకు రాయితీ ఇవాల్సిందే అంటున్నారు.

విశాఖ జిల్లాకు చెందిన జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారామ్ ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు బియ్యం ఫ్రీగా ఇస్తున్నామని చెప్పుకుంటోందని, దాన్ని ఉడికించే గ్యాస్ సిలిండర్ ధరలోనూ రాయితీ ఇస్తే ఆల్ హ్యాపీస్ కదా అని సూచిస్తున్నారు. మరి మోడీ మాస్టార్ ఈ డిమాండ్ ని పట్టించుకుంటారా.