బ్రిస్బేన్ లో వైఎస్ఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

సెప్టెంబర్ 2 న దివంగత మహానేత వైస్సార్ వర్ధంతి సంద‌ర్భంగా ముందస్తుగా ఘన నివాళులు అర్పించారు ఆస్ట్రేలియా లోని ప్రవాస భారతీయులు.  Advertisement బ్రిస్బేన్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు  ఎన్నారైలు మాట్లాడుతూ…

సెప్టెంబర్ 2 న దివంగత మహానేత వైస్సార్ వర్ధంతి సంద‌ర్భంగా ముందస్తుగా ఘన నివాళులు అర్పించారు ఆస్ట్రేలియా లోని ప్రవాస భారతీయులు. 

బ్రిస్బేన్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు  ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ఆర్ గారు చిరస్మరణీయుల‌ని, అయన చేసిన గొప్ప పనులు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణ రెడ్డి వల్లూరి, బిజివేముల రఘు రెడ్డి, కర్రి శ్రీనివాస్, అల్లం యుగంధర్ రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, కనుబుద్ది సురేష్, గాదె విజయేందర్, కిషోర్, చాగంటి వంశీ, బొమ్మిరెడ్డి జస్వంత్, మందా రామకృష్ణ రెడ్డి ల తోపాటు పలువురు ఎన్ఆర్ఐ లు పాల్గొన్నారు.

ఈ కార్యకమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ముస్తఫా, బియ్యపు మధు సుధన్ రెడ్డి, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ మేడపాటి, చల్లా మధు తదితరులు మాట్లాడి కార్యక్రమ నిర్వ‌హ‌ణ‌ను అభినందించి, వైఎస్ఆర్ సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.