Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - Special Articles

నిప్పులు చిమ్ముతూ.. పీఎస్‌ఎల్‌వీ మరో సక్సెస్‌.!

నిప్పులు చిమ్ముతూ.. పీఎస్‌ఎల్‌వీ మరో సక్సెస్‌.!

నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసింది పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అమ్ములపొదిలోని అత్యంత నమ్మకమైన వాహక నౌక ఇది. తాజాగా ఈ రోజు పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్‌ని ఇస్రో ప్రయోగించింది. అత్యంత అధునాతనమైన నావిగేషన్‌ వ్యవస్థ కోసం రూపొందించిన ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ-27న రాకెట్‌ నింగికి తీసుకెళ్ళింది విజయవంతంగా.

మొత్తం 7 ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ ఉపగ్రహాహాల్ని ఇస్రో నింగికి పంపాల్సి వుంది. తద్వారా నావిగేషన్‌ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం పంపింది నాలుగో ఉపగ్రహం. ఉపగ్రహ తయారీ కోసం 125 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన ఉపగ్రహాలూ ఈ ఏడాదిలోనే నింగిలోకి పంపుతారు. జీపీఎస్‌ తరహాలో భారత్‌ స్వయంగా అభివృద్ధి చేసుకున్న నావిగేషన్‌ వ్యవస్థ ఇది కావడం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?