Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఏపీ ప్రజలు గెలిపించేది ఆ పార్టీనే!

ఏపీ ప్రజలు గెలిపించేది ఆ పార్టీనే!

టీడీపీ కూటమి అధికారంలోకి రావడమే తరువాయి అని చంద్రబాబు సహా అంతా లెక్కలేసుకుని సంబరపడుతున్న పరిస్థితి ఉంది. మే 13న జరిగే పోలింగ్ లాంచనమే అని కూడా భావిస్తున్న పరిస్థితి. అతి ధీమా కాదు ఆత్మ విశ్వాసంతో చెప్పే మాట అని అంటున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ పర్యటనకు వచ్చిన నందమూరి లక్ష్మీపార్వతి ఏపీ ప్రజలు వైసీపీనే మరోసారి గెలిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

తాను రాష్ట్రమంతా పర్యటించి వస్తున్నాను అని అన్నారు. ప్రజల మనసులో జగన్ ఉన్నారని చెప్పారు. ఎన్టీయార్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రాష్ట్రాన్ని కూడా వెన్నుపోటు పొడిచారు అని హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు పాలనలో ఏమీ అభివృద్ధి జరగలేదు అన్నారు.

పెట్టుబడులు జగన్ హయాంలోనే ఏపీకి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. నరేంద్ర మోడీ బాబుని ఎందుకు సమర్ధిస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. మోడీ పూర్తిగా మారిపోయారు అని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. పోలవరానికి ఏ మాత్రం నిధులు ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం భావ్యమా అని ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబు పవన్ లు వాడుతున్న భాష దారుణంగా ఉందని అన్నారు. ఏపీలో అన్ని వర్గాల సంక్షేమం కోసం జగన్ చేస్తున్న కార్యక్రమాలను చంద్రబాబు అండ్ కో గండి కొట్టాలని చూస్తున్నారు అన్నారు. రైతులకు, విద్యార్థులకు అందాల్సిన పథకాలను కూడా బాబు అండ్ కొ అడ్డుకున్నారని ఆరోపించారు. అలాగే పింఛను లబ్ధిదారుల పాలిట ప్రతిపక్షాలు శాపంగా మారారని ఆమె విమర్శించారు.

ఇదిలా ఉండగా ఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకమని ఆమె అన్నారు. అందుకే జగన్ విశాఖ మీద పూర్తి ఫోకస్ పెట్టారని ఆమె గుర్తు చేశారు. వెనకబడిన ఉత్తరాంధ్రా సహా ఏపీ బాగుపడాలి అంటే మరోసారి జగన్ అధికారంలోకి రావాలని ఆమె అన్నారు. ప్రజలు కూడా ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని ఆమె అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?