Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోలు..కామియోలు..

అప్పుడెప్పుడో ఆదిశంకరాచార్య సినిమా వచ్చింది. సినిమా నిర్మాత కమ్ దర్శకుడు, ఇంకా ఆ సినిమాతో బాదరాయణ సంబంధం వున్నవారు అడిగేసరికి కాదనలేక, బోలెడు మంది హీరోలు ఆ సినిమాలో చిన్నా చితకా పాత్రల్లో కనిపించారు. మళ్లీ అలాంటి సినిమా ఒకటి రాబోతోంది. జోనర్ వేరనుకోండి. 

ఈ సినిమా కోసం నాగార్జున, రవితేజ, శింబు కూడా అక్కడక్కడ తళుక్కున మెరుస్తారట. ఇంతకీ ఈసినిమా లో మెయిన్ లీడ్ ఎవరంటే, అడవిశేష్, మంచు లక్ష్మి. వాళ్ల పాత్రలు ఏమిటన్నది పక్కన పెడితే, ఇలాంటి టాప్ హీరోలు కామియోలుగా కనిపించేంత పాత్రలేమిటో మరి దొంగాట సినిమా చూస్తే కానీ  తెలియదు. 

ఈ సినిమాకు  వంశీకృష్ణ డైరక్టర్. ఇతగాడు కొన్నాళ్లు గౌతమ్ మీనన్ దగ్గర శిష్యరికం చేసాడు. అన్నట్లు మంచు లక్ష్మి వుంది కాబట్టి..మోహన్ బాబు కూడా ఓసారి కనిపించడానికి ఓకె అన్నాడట. మరి విష్ణు, మనోజ్ కూడా కనిపించేస్తే మరీ బాగుంటుందిగా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?