Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా హీరో కోసం ఆస్తి అమ్మేసాడు!

మెగా హీరో కోసం ఆస్తి అమ్మేసాడు!

‘రేయ్‌’ సినిమాపై ముప్పయ్‌ కోట్లకి పైగా ఖర్చు పెట్టిన వైవిఎస్‌ చౌదరి ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి నానా అవస్థలు పడుతున్నాడు. తాను సంపాదించినదంతా ఈ చిత్రం మీదే ఇన్వెస్ట్‌ చేసిన చౌదరి తనకి మెగా హీరోల నుంచి సపోర్ట్‌ ఉంటుందని అనుకున్నాడు. కానీ మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తొలి చిత్రం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నా దానిని గట్టెక్కించే మెగాస్టార్‌ ఎవరూ కనిపించడం లేదు. 

ఈ చిత్రాన్ని విడుదల చేయడమెలాగో తెలీక, అతను పెట్టిన ఖర్చుకి తగ్గ ఆఫర్లు రాక.. వైవిఎస్‌ చౌదరి ఆస్తులు అమ్ముకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. గుడివాడలోని తన బొమ్మరిల్లు థియేటర్‌ని ఇటీవలే చౌదరి అమ్మకానికి పెట్టాడని టాక్‌ వినిపిస్తోంది. ఈ థియేటర్‌ అమ్మినా కానీ ‘రేయ్‌’కి లైన్‌ క్లియర్‌ అవడం కష్టమేనని, ఇంకా చాలా ఫైనాన్సులు క్లియర్‌ చేస్తే తప్ప సినిమా బయటకి రాదని చెప్పుకుంటున్నారు. 

మరోవైపు సాయి నటించిన రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ముందుగా విడుదల కానుంది. ఈ చిత్రం రిలీజ్‌ అయి తనకి మంచి పేరు వస్తే కనుక ‘రేయ్‌’ కష్టాలు కొంతవరకు తీరే అవకాశముంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?