Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

పూరి మారు బేరం

పూరి మారు బేరం

దర్శకుడు పూరి జగన్నాధ్ ది చాలా తెలివైన వ్వవహారం. టెంపర్ సినిమా చేసినందుకు డైరక్టర్ గానే కాకుండా, ఇతరత్రా కూడా కాస్త డబ్బులు చేసుకోవాలని చూస్తున్నారు. టెంపర్ సినిమా వెస్ట్ హక్కులను ఆయన 2.4 కోట్లకు తీసుకున్నారు. నిజానికి అది ఆయనకు మంచి రేటు. ఇలా అలా థియేటర్ అడ్వాన్స్ లే రెండు కు పైగా వచ్చేస్తాయి. పూరి కాబట్టి, ఏ మొహమాటాలతోనో బండ్ల ఆ రేటుకు ఇచ్చి వుంటారు. 

అయితే, పూరి ఇప్పుడు వాటిని మారు బేరానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన మూడు కోట్లు ఎవరు ఇస్తే వారికి హక్కులు ఇస్తానని మార్కెట్ లోకి ఫీలర్ వదిలినట్లు వినికిడి. అప్పుడే ఓ డిస్ట్రిబ్యూటర్ 2.75 కోట్ల వరకు వెళ్లాడని వినికిడి. అంటే పూరి కదలకుండానే ముఫై అయిదు లక్షల వరకు లాభం సంపాదించే అవకాశం వచ్చేసింది. కాస్త పట్టుకుంటే అరకోటికి చేరుకుంటుంది అది. పలుకుబడి, తెలివి వుంటే డబ్బులకు, వ్యాపారానికి కొదవేముంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?