Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమస్యల్లో 'సవ్యసాచి'

సమస్యల్లో 'సవ్యసాచి'

టాలీవుడ్ లో కథలకు పెద్ద కొరత వచ్చి పడింది. తీరా సరైన కథ దొరికితే, అది నాది అంటే నాది అనే సమస్యలు వస్తున్నాయి. ఇది చిరకాలంగా వున్నదే. శ్రీమంతుడు కథ కేసు ఇప్పటకీ కోర్టులో నడుస్తోంది. మొన్నటికి మొన్న కొత్తగా మిస్టర్ ఫెర్ ఫెక్ట్ స్టోరీ పై కేసు పడింది. అంతెదుకు జైలవకుశ లో హీరోకి నత్తి వుండడం అన్న పాయింట్ డైరక్టర్ బాబి ది కాదు, డైరక్టర్ ఫూరిజగన్నాధ్ ఎప్పుడో హీరో ఎన్టీఆర్ కు చెప్పిందన్న వార్తలు వున్నాయి.

వర్తమానానికి వస్తే, నాగ్ చైతన్య - చందు మొండేటి కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించాల్సిన సవ్య సాచి సినిమా కూడా ఇబ్బందుల్లో పడిందని వినికిడి. ఈ సినిమాలో హీరో కి ఎడం చేయి అతని మాట వినదు. దానికి సెపెరేట్ బ్రెయిన్ రూటు వుంటుంది. ఈ కథ, కథనం, మాటలు చందు మొండేటివి. కానీ ఇవి తనవి అని మరో రచయిత డైమండ్ రత్నం రైటర్స్ అసోసియేషన్ ముందు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. 

ప్రస్తుతం ఈ పంచాయతీ నడుస్తోందని, డబ్బులతో సెటిల్ మెంట్ కోసం ట్రయ్ చేస్తున్నారని, కానీ డైమండ్ రత్నం వినడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. డైమండ్ రత్నం చిన్నవాడు కాదు కదా? డబ్బులతో సరిపెట్టుకోవడానికి. టైటిల్ కార్డ్ కావాలని అడుగుతున్నారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?