Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రిష, కీర్తిసురేష్ మధ్య ఏం జరుగుతోంది?

త్రిష, కీర్తిసురేష్ మధ్య ఏం జరుగుతోంది?

గతంలో విక్రమ్-త్రిష కాంబినేషన్ లో సామి లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. తెలుగులో కూడా లక్ష్మీ నరసింహ పేరుతో రీమేక్ అయింది. ఇక్కడ కూడా అది పెద్ద హిట్. అలాంటి సినిమాకు మళ్లీ ఇన్నేళ్లకు సీక్వెల్ రెడీ అవుతోంది. డైరక్టర్ హరి, హీరో విక్రమ్ కలిసి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అప్పట్లో విక్రమ్ సరసన నటించిన త్రిషనే హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ త్రిష మాత్రం యూనిట్ కు షాకిచ్చింది.

ఇలా ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైందో లేదో, అలా సామి-2 సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ (స్క్రిప్ట్ విషయంలో తేడా) వల్లనే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేసింది త్రిష.  దీంతో షాకవ్వడం యూనిట్ వంతయింది. కానీ అసలు కారణం వేరే ఉందంటున్నారు కోలీవుడ్ జనాలు.

సామి-2లో  త్రిషతో పాటు కీర్తిసురేష్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మూవీలో త్రిష కంటే కీర్తిసురేష్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. తాజాగా విడుదల చేసిన ఆన్-లొకేషన్ స్టిల్స్ లో కూడా త్రిషను పక్కనపెట్టి కీర్తిసురేష్ తో ఉన్న ఫొటోల్నే విడుదల చేయడంతో త్రిషకు కోపమొచ్చినట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఇప్పుడు కోలీవుడ్ లో త్రిష కంటే కీర్తిసురేష్ కే క్రేజ్ ఎక్కువగా ఉంది. త్రిషకు చేతినిండా సినిమాలైతే ఉన్నాయి కానీ బడా ప్రాజెక్టులేవీ ఆమెకు రావడం లేదు. ఇలాంటి టైమ్ లో వచ్చిన సామి సీక్వెల్ ను కేవలం కీర్తిసురేష్ కారణంగానే త్రిష రిజెక్ట్ చేసిందంటూ కోలీవుడ్ లో కథనాలు పుట్టుకొస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?