హీరో రాజ్ తరుణ్ టూ ఛూజీ..ఒక పట్టాన డైరక్టర్లు నచ్చరు..ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ తో తీసే సినిమాకు ఇప్పటికి ఓకరిద్దరిని మార్చేసాడు. ఇప్పుడు మూడో డైరక్టర్ వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి కొత్త డైరక్టర్లు కూడా అలాగే వున్నారు. స్క్రిప్ట్ చెప్పేటపుడు స్వర్గం..తీసాక నరకం చూపించేస్తారు. ఇటీవల వరుసగా థియేటర్ల దగ్గర ఫట్ మంటున్న కొత్త దర్శకుల సినిమాలు చూస్తుంటే..బాబోయ్ అనిపించేస్తోంది.
అసలు వీళ్లకు డైరక్షన్ చాన్స్ ఎలా ఇచ్చారా అని అనిపించేస్తున్న జనాలు కూడా వున్నారు. అందుకే రాజ్ తరుణ్ లాంటి హీరోలు ఒకటికి పది సార్లు ఆలోచించి కానీ ఓకె అనలేకపోతున్నట్లుంది. మారుతితో నేరుగా, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి రెండు సినిమాలు చేయాల్సి వుంది. వీటిలో ఓ సినిమాకు తమిళ యంగ్ డైరక్టర్ ను ఒకర్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ మళ్లీ అంతలోనే అతగాడిని మార్చేసారని వినికిడి.
గతంలో ఓ డైరక్టర్ ను వారం రోజులు టెస్ట్ చేసి మార్చేసిన సంగతి తెలిసిందే. సంజనా రెడ్డి ఓ కొత్త డైరక్టర్ కు చాన్స్ ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వర్మ దగ్గర కొద్ది రోజులు, ఓ ఛానెల్ లో పనిచేసిన అనుభవం వున్నాయని తెలుస్తోంది. మరో సినిమాకు ది ఎండ్ అనే సినిమా చేస్తున్న రాహుల్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
రాజ్ తరుణ్ కు డైరక్షన్ చేయాలని మహా సరదా.. అతడు వచ్చిన లైన్ నే అది. అయితే ఇప్పట్లో అలాంటి పని చేయడం అంటే హీరో కెరీర్ ను పణంగా పెట్టడమే. అందుకే ఇలా కొత్త డైరక్టర్ కు చాన్స్ ఇచ్చి, తనే చేయాలనుకుంటున్నాడా అన్న డవుట్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. లేదూ ఎంతకీ నచ్చక మార్చేస్తున్నాడా? అని అనుమానం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు