Advertisement

Advertisement


Home > Politics - Andhra

రోజా అడ్డాలో జ‌న‌మే జ‌నం... గెలుపుపై!

రోజా అడ్డాలో జ‌న‌మే జ‌నం... గెలుపుపై!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని పుత్తూరులో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. జగ‌న్ ప్ర‌చార‌స‌భ‌కు జ‌నం వెల్లువెత్తారు. సీఎం సీఎం నినాదాల‌తో హోరెత్తించారు. భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సందోహాన్ని చూసి మంత్రి ఆర్కే రోజా ఆనందానికి అవ‌ధుల్లేవు.

మ‌రోసారి ఆమెలో గెలుపు క‌ల క‌నిపించింది. న‌గ‌రిలో టీడీపీ, వైసీపీ మ‌ధ్య తీవ్ర పోటీ వుంద‌ని ప్ర‌తి స‌ర్వే చెబుతోంది. రోజాకు ఎదురు గాలి వీస్తోంద‌నే వాళ్లే ఎక్కువ‌. కానీ రోజాలో గెలుపుపై ఎంతో ధీమా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగింపు ద‌శ‌కు చేరుకోడానికి ఒక రోజు ముందు జ‌గ‌న్ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. జ‌గ‌న్ స‌భ‌కు వేలాదిగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు.

దీంతో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గాలి వీస్తోంద‌నే అభిప్రాయాన్ని క‌లిగించింది. న‌గ‌రిలో రోజా ఓడిపోతుంద‌నే ప్ర‌చారం నిజ‌మ‌య్యేలా లేద‌ని... జ‌గ‌న్ స‌భ‌కు వ‌చ్చిన జ‌నాన్ని చూసేవారికి అనిపిస్తుంది. జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ త‌న చెల్లి రోజ‌మ్మ మంచి మ‌న‌సున్న వ్య‌క్తి అని కితాబిచ్చారు. మంచి చేస్తుంద‌న్న సంపూర్ణ న‌మ్మ‌కం, విశ్వాసం త‌న‌కున్నాయ‌న్నారు.

అప్పుడ‌ప్పుడు మాట కాస్త క‌ఠినంగా వుంటుందే కానీ, మ‌న‌సు మాత్రం వెన్న అని ప్ర‌శంసించారు. త‌న చెల్లిని ఆశీర్వ‌దించాల‌ని మీ అంద‌ర్నీ రెండు చేతులు జోడించి ప్రాథేయ‌ప‌డుతున్న‌ట్టు జ‌గన్ చెప్పారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?