చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్: గ్రాఫిక్స్ లేవు

తన నెక్ట్స్ సినిమాలో హీరో ఎవరైనా, కథ ఏదైనా అందులో గ్రాఫిక్స్ ఉండవని ఇంతకుముందే స్పష్టంచేశాడు దర్శకుడు రాజమౌళి. అలా చెప్పిన కొన్ని రోజులకే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు.…

తన నెక్ట్స్ సినిమాలో హీరో ఎవరైనా, కథ ఏదైనా అందులో గ్రాఫిక్స్ ఉండవని ఇంతకుముందే స్పష్టంచేశాడు దర్శకుడు రాజమౌళి. అలా చెప్పిన కొన్ని రోజులకే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. మరి ఈ భారీ ప్రాజెక్టులో గ్రాఫిక్స్ ఉండవా..?

నిజమే.. చెర్రీ, తారక్ మల్టీస్టారర్ మూవీలో గ్రాఫిక్స్ ఉండవు. గ్రాఫిక్స్ కంటే ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సినిమా స్క్రీన్ ప్లే అల్లుతున్నారు. ఈ మేరకు రాజమౌళి, విజయేంద్రప్రసాద్ మధ్య జోరుగా చర్చలు సాగుతున్నాయి. 

ఈ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి తమ క్యారెక్టర్స్ ఏంటనే విషయంపై ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. కంప్లీట్ స్క్రీన్ ప్లే సిద్ధమైన తర్వాత మరోసారి ఇద్దరికీ వినిపించబోతున్నాడు. ఈ సినిమాలో డ్రామా మాత్రమే ఉంటుంది. గ్రాఫిక్స్ ఉండవనే విషయాన్ని హీరోలిద్దరికీ స్పష్టంచేశాడట. రాజమౌళి బ్యాచ్ ఈ విషయాన్ని నిర్థారించింది.

అయితే సినిమాలో గ్రాఫిక్స్ లేకపోయినా యాక్షన్ పార్ట్ కు మాత్రం ఢోకా ఉండదు. ఎలాంటి ప్రయోగాలకు పోకుండా హై ఎమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులతో పక్కా కమర్షియల్ మూవీ సిద్ధం చేస్తున్నాడు జక్కన్న.