రాధేశ్యామ్ పయనం ఇలా…

సినిమా కూడా నది లాంటిదే. ఎక్కడో పుట్టి…ఎక్కడో పెరిగి…ఎక్కడికో చేరుతుంది. చాలా సినిమాల కథలు ఎక్కడో పుట్టి..ఎవరి దగ్గరకో చేరి, ఇంకెక్కడికో వెళ్లి..ఆఖరికి మరెక్కడో సెటిల్ అవుతాయి.  Advertisement త్వరలో విడుదల కాబోతున్న రాధేశ్వామ్…

సినిమా కూడా నది లాంటిదే. ఎక్కడో పుట్టి…ఎక్కడో పెరిగి…ఎక్కడికో చేరుతుంది. చాలా సినిమాల కథలు ఎక్కడో పుట్టి..ఎవరి దగ్గరకో చేరి, ఇంకెక్కడికో వెళ్లి..ఆఖరికి మరెక్కడో సెటిల్ అవుతాయి. 

త్వరలో విడుదల కాబోతున్న రాధేశ్వామ్ వ్యవహారం కూడా అచ్చం ఇలాంటిదే అని తెలుస్తోంది. ఈ సినిమా కథ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ది కాదట. ఈ కథను తయారు చేసింది దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. 

చిత్రమైన కథలు రాసుకుంటారు ఆయన. అలాగే ఆయన పామిస్ట్రీ అన్న పాయింట్ కీలకంగా ఈ కథ తయారుచేసుకున్నారు. దాన్ని తొలుతగా తీసుకెళ్లింది హీరో వెంకటేష్ దగ్గరకు. అప్పటికి ఇది లవ్ స్టోరీ కీలకంగా కాదు. 

పామిస్ట్రీనే కీలకం. అయితే ఎందుకో వెంకీకి ఈ స్క్రిప్ట్ సెకండాఫ్ మీద పెద్దగా పాజిటివ్ ఒపీనియన్ రాలేదని తెలుస్తోంది. దాంతో ఆయన సారీ చేయలేనని చెప్పేసారు. సురేష్ కాంపౌండ్ అంతే. స్క్రిప్ట్ విషయంలో చాలా పట్టుదలగా వుంటుంది.

ఆ తరువాత మరి ఎందుకో తెలియదు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఆ కధను అమ్మేసారు. ఆ తరువాత ఆ కథలోకి పామిస్ట్రీతో సమానంగా లవ్ స్టోరీ వచ్చి చేరింది. పాన్ ఇండియా సినిమాగా మారింది. ఏ కథ ఎవరికి ప్రాప్తమో..మరి.