మొన్న ప్రియాంకరెడ్డి.. ఈసారి సాఫ్ట్ వేర్ ఉద్యోగి

ప్రియాంక రెడ్డి ఉదంతం ఇంకా ప్రజల హృదయాల్ని ఛిద్రం చేస్తూనే ఉంది. అంతలోనే మరో దురాగతం. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన…

ప్రియాంక రెడ్డి ఉదంతం ఇంకా ప్రజల హృదయాల్ని ఛిద్రం చేస్తూనే ఉంది. అంతలోనే మరో దురాగతం. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన కూడా హైదరాబాద్ లోనే జరిగింది. ఓవైపు రేపిస్టులను ఉరి తీయాలంటూ దేశం మొత్తం డిమాండ్ చేస్తున్న టైమ్ లో ఈ ఘటన జరగడం దురదృష్టకరం.

హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఓ అపార్ట్ మెంట్ లో అక్కాచెల్లెళ్లు ఉంటున్నారు. అక్క ప్రైవేటు ఉద్యోగి, చెల్లెలు సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పెళ్లి సంబంధాల కోసం కొన్ని రోజుల కిందట అక్క తన వివరాల్ని మ్యాట్రిమోనీ సైట్ లో ఉంచింది. ఆ వివరాల ఆధారంగా ఆమెను చూసేందుకు 10 రోజుల కిందట ఓ వ్యక్తి అపార్ట్ మెంట్ కు వచ్చాడు.

అప్పట్నుంచి అతనొక్కడే తరచుగా వస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న కూడా అతడు అపార్ట్ మెంట్ కు వచ్చాడు. అయితే ఏదో పనిమీద అక్క బయటకు వెళ్లింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మాత్రం ఫ్లాట్ లో ఉంది. అదే అదనుగా భావించి అతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను రేప్ చేసి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆపార్ట్ మెంట్ కొచ్చిన అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాల్ని హాస్పిటల్ లో జాయిన్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కలున్న సీసీ కెమెరాల ఆధారంగా ఎంక్వయిరీని వేగవంతం చేశారు. ప్రియాంక రెడ్డి హత్య కేసు ఇంకా నడుస్తుండగానే, హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.