సత్యా నాదెళ్ల నివాసంలో విషాదం

రిటైర్డ్ ఐఎఎస్ అదికారి , మైక్రో సాప్ట్ సిఈఓ సత్య నాదెళ్ల తండ్రి బిఎన్ యుగంధర్ కన్నుమూశారు. యుగంధర్ వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు. Advertisement గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. గతంలో…

రిటైర్డ్ ఐఎఎస్ అదికారి , మైక్రో సాప్ట్ సిఈఓ సత్య నాదెళ్ల తండ్రి బిఎన్ యుగంధర్ కన్నుమూశారు. యుగంధర్ వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు.

గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. గతంలో ఆయన పివి నరసింహారావు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. గ్రామీణాబివృద్ది రంగంలోపలుమార్పులకు ఆయన నాందీ పలికారు. 

నిజాయితీపరుడైన అదికారిగా పేరొందిన యుగందర్ డెహ్రాడూన్ లోని ఐఎఎస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా కూడా పనిచేశారు. సమర్దుడు అయిన అదికారిగా ఆయన పేరొందారు. వారి స్వస్థలం అనంతపురం జిల్లా .

కాగా బీఎన్‌ యుగంధర్‌ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. అయితే అనంతరం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇక సత్యా నాదెళ్ల తల్లి ప్రభావతి 2015లో మరణించారు.