రిపబ్లిక్ డే ఆఫర్: జియో నుంచి మరో పండగ

పండగొస్తే చాలు జియో వినియోగదారులు నిజంగానే పండగ చేసుకుంటున్నారు. ప్రతి పండక్కి ఏదో ఒక ఆఫర్ పెడుతున్న జియో.. గణతంత్ర దినోత్సవం వేళ మరో బంగారంలాంటి ప్లాన్ ప్రకటించింది. ఈసారి అన్-లిమిటెడ్ టాక్ టైమ్…

పండగొస్తే చాలు జియో వినియోగదారులు నిజంగానే పండగ చేసుకుంటున్నారు. ప్రతి పండక్కి ఏదో ఒక ఆఫర్ పెడుతున్న జియో.. గణతంత్ర దినోత్సవం వేళ మరో బంగారంలాంటి ప్లాన్ ప్రకటించింది. ఈసారి అన్-లిమిటెడ్ టాక్ టైమ్ పై ఫోకస్ పెట్టింది. అతి తక్కువ రీచార్జ్ కే అన్-లిమిటెడ్ కాల్స్ ఆఫర్ ఇది.

రిపబ్లిక్ డే కానుకగా 49రూపాయల రీచార్జ్ కే నెలంతా అన్-లిమిటెడ్ టాక్ టైం ప్రకటించింది జియో. డేటాతో ఎక్కువగా పనిలేని గ్రామీణ వినియోగదారులకు ఈ ప్లాన్ ఎంతగానే ఉపయోగపడుతుంది. అయితే ఈ 49రూపాయల రీచార్జ్ ప్లాన్ కేవలం 1500రూపాయల జియో 4జీ ఫోన్లు వాడుతున్న కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే పూర్తిగా గ్రామీణ భారతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన పథకం అన్నమాట.

ఇక జియో 4జీ ఫోన్లు కాకుండా ఇతర హ్యాండ్ సెట్లు వాడుతున్న కస్టమర్లకు 98రూపాయల ప్లాన్ ను ప్రకటించింది. 28రోజులకు 98రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే.. నెలంతా అన్-లిమిటెడ్ కాల్స్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్లు వాడుతున్న వినియోగదారులకు మినిమం డేటాను అందిస్తోంది జియో.

ఒకవేళ పరిమితికి మించి డేటా కావాలనుకుంటే అప్పటికప్పుడు టాప్-అప్ చేసుకునే డేటా ప్లాన్స్ ను కూడా సవరించింది. కేవలం 11రూపాయల మొదలుకొని ఈ డేటా ఆఫర్లను అందుబాటులో ఉంచింది. తాజాగా ప్రకటించిన ప్లాన్స్ తో గ్రామీణ ప్రాంతాల్లో తమకు మరింత మంది కస్టమర్లు పెరుగుతారని అంచనా వేస్తోంది జియో.