బెంగళూరులో బాంబుపేలుడు

బెంగళూరులో బాంబు పేలుడు సంభవించింది. సాయంత్రం ఎనిమిదిన్నర గంటల సమయంలో బెంగళూరులోని చర్చ్‌ స్ట్రీట్‌లోగల ఓ రెస్టారెంట్‌ వద్ద పేలుడు సంభవించడంతో, ఒక్కసారిగా జనం బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.…

బెంగళూరులో బాంబు పేలుడు సంభవించింది. సాయంత్రం ఎనిమిదిన్నర గంటల సమయంలో బెంగళూరులోని చర్చ్‌ స్ట్రీట్‌లోగల ఓ రెస్టారెంట్‌ వద్ద పేలుడు సంభవించడంతో, ఒక్కసారిగా జనం బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

కాగా, ప్రమాద స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. పేలింది ‘ఐఈడీ’గా పోలీసులు గుర్తించారు. తక్కువ జరిగింది తీవ్రత కల పేలుడుగా పోలీసులు వెల్లడిరచారు. ఈ ఘటనతో బెంగళూరులో హై అలర్ట్‌ ప్రకటించారు. బెంగళూరు బాంబు పేలుడు ఘటనతో ఇతర రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి.

జనవరి 26 రిపబ్లిక్‌ దినోత్సవాల్ని ఉగ్రవాదులు టార్గెట్‌గా చేసుకున్నారంటూ గత కొంతకాలంగా ఇంటెలిజెన్స్‌ వర్గాలనుంచి హెచ్చరికలు ఆయా రాష్ట్రాలకు అందుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినా బెంగళూరులో బాంబు పేలడం ఆందోళన కలిగిస్తోంది.