అనాధలకు ‘గ్రేటాంధ్ర’ దీపావళి కానుక

సమాజంలో తన వంతు బాధ్యతను నెరవేర్చాలన్నది గ్రేటాంధ్ర సత్సంకల్పం. అందుకే గ్రేటాంధ్ర ఛారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లు కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నా, వాటికి ఓ వేదికగా వుండేందుకు ఈ…

సమాజంలో తన వంతు బాధ్యతను నెరవేర్చాలన్నది గ్రేటాంధ్ర సత్సంకల్పం. అందుకే గ్రేటాంధ్ర ఛారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లు కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నా, వాటికి ఓ వేదికగా వుండేందుకు ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ తొలి కార్యక్రమంగా హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలోని అనాధాశ్రమాల్లో పిల్లలకు దీపావళి టపాసులు అందించింది. 

సుమారు 40 వేల విలువైన టపాసులను వివిధ ఆశ్రమాల్లోని పిల్లలకు అందించారు. గ్రేటాంధ్ర వెంకట్, ప్రముఖ జ్యోతిష్యులు వక్కతం చంద్రమౌళి, వ్యాపార వేత్త గుర్రెడ్డి కలిసి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసారు. గ్రేటాంధ్ర ఉద్యొగి నాగేశ్వర రెడ్డి, ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేసారు. అనాధలకు దీపావళి కాంతులు అందించాలన్న గ్రేటాంధ్ర ఆలోచనను, ఆశ్రమాల నిర్వాహకులు అభినందించారు.