ఎపికి అమెరికాలో ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్ లు

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు ప్రవాసాంద్రులను ఎపి తరుపున అమెరికాలో బ్రాండ్ అంబాసిడర్ లు గా వ్యవహరించడానికి అనుమతి పత్రాలు ఇచ్చింది. తాళంకి శ్రీధర్, మహేష్ నంద్యాల అనే ఇద్దరు ఎన్.ఆర్.ఐ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్ లు…

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు ప్రవాసాంద్రులను ఎపి తరుపున అమెరికాలో బ్రాండ్ అంబాసిడర్ లు గా వ్యవహరించడానికి అనుమతి పత్రాలు ఇచ్చింది. తాళంకి శ్రీధర్, మహేష్ నంద్యాల అనే ఇద్దరు ఎన్.ఆర్.ఐ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్ లు గా నియమితులయ్యారు. 

అనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాధరెడ్డి వారికి పత్రాలు అందచేశారు. అమెరిలో ప్రవాస భారతీయుల నుంచి ఎపికి ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి గాను వారు పలువురితో ఒప్పందాలు చేయించడంలో వీరు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నేపధ్యంలో వారిని బ్రాండ్ అంబాసిడర్ లు గా నియమించినట్లు మంత్రి పల్లె చెప్పారు. వీరిద్దరూ అనంతపురం జిల్లాకు చెందినవారు కావడం విశేషం.

శ్రీధర్ స్వయంగా అనంతపురంలో ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి కూడా సిద్దమవుతున్నారు. కాగా తమను బ్రాండ్ అంబాసిడర్ లు గా నియమించినందుకు వారు దన్యవాదాలు తెలిపారు.